Friday, May 17, 2024

కన్నీటి వీడ్కోలు… చ‌ల్లా అంతిమ‌యాత్ర‌కు భారీగా త‌ర‌లివ‌చ్చిన జ‌నం..

అశేష జన వాహిని మధ్య ఎమ్మెల్సీ చల్లా భగీరథ రెడ్డి అంతిమయాత్ర ప్రారంభమైంది. శోక సంద్రంలో అవుకు మండలం. తమ నాయకుడిని చివరి చూపు చూసేందుకు వైఎస్ఆర్సిపి నాయకులు, చల్లా అభిమానులు భారీగా తరలివచ్చారు. ప్రభుత్వ అధికార లాంచనాలతో ఏర్పాట్లు చేశారు. డోన్ డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, బనగానపల్లె సీఐ సుబ్బరాయుడు, అవుకు, బనగానపల్లె, నందివర్గం, ఎస్ఐలు జగదీశ్వర్ రెడ్డి, రామిరెడ్డి, రామాంజనేయరెడ్డి, రమేష్ రెడ్డి లు గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. ఎమ్మెల్సీ చల్లా అంతిమయాత్ర చల్లా భవన్ నుండి ప్రారంభమై అవుకు పట్టణ పురవీధుల మీదుగా సాగుతూ చల్లా ఫామ్ హౌస్ లో ఖననం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement