Sunday, April 28, 2024

MI vs CSK | సిక్స్‌లతో చెలరేగిన ధోనీ.. ముంబయి ముందు భారీ టార్గెట్

వాంఖడే స్టేడియం వేదిక‌గా ముంబైతో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు భారీ స్కోరు సాధించింది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (69), శివమ్ దూబే (66) అర్ధ సెంచరీలతో చెలరేగారు. చివర్లో వచ్చిన ధోనీ (20: 4 బంతుల్లో 3 సిక్సర్లు) బౌండరీలతో హోరెత్తించాడు. ఫలితంగా చెన్నై జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేయగలిగింది.

ఇక ముంబై బౌలర్లలో కెప్టెన్ హార్దిక్ పాండ్యా రెండు వికెట్లు పడగొట్టగా… శ్రేయాస్ గోపాల్, గెరాల్డ్ కోయెట్జీ చెరో వికెట్ దక్కించుకున్నారు. ఇక 207 పరుగుల టార్గెట్‌తో ముంబై ఇండియన్స్ జట్టు ఛేజింగ్‌కు దిగనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement