Wednesday, May 1, 2024

Delhi | ఢిల్లీలో తెలంగాణ సర్పంచుల బృందం.. జాతీయ పురస్కారాలు అందుకోనున్న సర్పంచ్‌లు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలలో ఉత్తమ పనితీరు కనబరిచినందుకుగాను జాతీయ పురస్కారాలకు ఎంపికైన సర్పంచ్‌ల బృందం శుక్రవారం ఢిల్లీ చేరుకుంది. వారికి రాష్ట్ర గ్రామీణ అభివృద్ధి పంచాయతీ శాఖ అధికారులు స్వాగతం పలికారు. దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ పంచాయత్‌ రాష్ట్ర ఉత్తమ పురస్కారాల పేరుతో అందజేస్తున్న జాతీయ స్థాయి అవార్డులను 12 మంది సర్పంచులు అందుకోనున్నారు.

సోమవారం ఢిల్లీ విజ్ఞాన్‌ భవన్‌లో జరిగే ‘నేషనల్‌ కాన్ఫరెన్స్‌ ఆన్‌ ఇన్సెంటివైజేషన్‌ ఆఫ్‌ పంచాయత్స్‌ కమ్‌ అవార్డ్‌ సెర్మనీ’లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఈ అవార్డులను ప్రదానం చేయనున్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ గ్రామీణాభివృద్ధి, పంచాయతీల శాఖ మంత్రి, వివిధ శాఖల అధికారులు పాల్గొననున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement