Thursday, May 9, 2024

దివంగత సీఎం వైఎస్ఆర్ కు పిండ ప్రదానం చేసిన వీరాభిమాని..

భూపాలపల్లి, ప్రభన్యూస్ : దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి కి ప్రాణహిత పుష్కరాల్లో భాగంగా పిండ ప్రధానం చేసి తన అభిమానాన్ని చాటుకున్నాడు ఓ వీరాభిమాని.. వివరాల్లోకి వెళితే జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలంలోని కాలేశ్వరం క్షేత్రంలో బుధవారం వైఎస్ రాజశేఖరరెడ్డి వీరాభిమాని, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు అప్పం కిషన్ కాళేశ్వరం త్రివేణి సంగమం లో ప్రాణహిత పుష్కరాలలో భాగంగా వైఎస్ఆర్ చిత్రపటానికి పండితులతో సాంప్రదాయబద్ధంగా పిండ ప్రధాన పూజలు చేసి పుష్కర స్నానం ఆచరించాడు. అనంతరం కాళేశ్వర ముక్తీశ్వర స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి షర్మిలకు ముక్తీశ్వర స్వామి వారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement