Saturday, April 27, 2024

నాగిరెడ్డిపేటలో అనుమానాస్పద స్థితిలో దంపతులు మృతి..

నాగిరెడ్డిపేట్ : కామారెడ్డి జిల్లాలో దంప‌తులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఈ సంఘటన గురువారం కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట్ మండలంలో చోటు చేసుకుంది. మండలంలోని నాగిరెడ్డిపేట్ గ్రామ శివారులో గల ఒక కోళ్ల ఫారంలో కాపలా ఉండే భార్యభర్తలు అల్లపురం యేసయ్య(45), అల్లాపురం సాయవ్వ(40)లు గదిలో పడుకున్న చోటనే మృతి చెందారు. స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకుని ప్ర‌మాదానికి గ‌ల కార‌ణాల‌ను తెలుసుకున్నారు. ఈ మేర‌కు ద‌ర్యాప్తు ప్రారంభించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement