Friday, April 26, 2024

Breaking: MP కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై కేసు నమోదు

కాంగ్రెస్ పార్టీ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై కేసు నమోదైంది. ఐపీసీ 506 సెక్షన్ కింద కోమటిరెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. నల్గొండ వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. తనను చంపుతానని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి బెదిరించారని టీపీసీసీ ఉపాధ్యక్షుడు చెరుకు సుధాకర్ కొడుకు సుహాన్ ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. తన అభిమానులు, కార్యకర్తలు చెరుకు సుధాకర్ ను చంపేందుకు వంద కార్లలో తిరుగుతున్నారని బెదిరించిన ఆడియో సంభాషణ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ ఆడియో సంభాషణపై భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నిన్న వివరణ ఇచ్చారు. భావోద్వేగంతోనే తాను ఈ వ్యాఖ్యలు చేసినట్టుగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పారు. ఈ విషయానికి ఇప్పటితో పుల్ స్టాప్ పెట్టాలని ఆయన చెరుకు సుధాకర్ ను కోరారు. తన కొడుకుకు ఫోన్ చేసి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి బెదిరింపులకు పాల్పడడంపై కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ సంఘానికి చెరుకు సుధాకర్ నిన్న ఫిర్యాదు చేశారు. అంతేకాదు రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నేతలకు చెరుకు సుధాకర్ లేఖ రాశారు. బెదిరింపులపై చెరుకు సుధాకర్, ఆయన కొడుకు సుహస్ లు పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు

Advertisement

తాజా వార్తలు

Advertisement