Sunday, May 5, 2024

13 ఏళ్ల కుర్రాడి సంచలనం.. ఇంటర్‌ స్కూల్‌ టోర్నీలో 500కి పైగా పరుగులు

13 ఏళ్ల కుర్రాడు సంచలన ప్రదర్శన చేశాడు. ఇంటర్‌ స్కూల్‌ టోర్నీలో 500కు పైగా రన్స్‌ చేసి నాటౌట్‌గా నిలిచాడు. లిమిటెడ్‌ ఓవర్లలో విధ్వంసం సృష్టిస్తూ రికార్డు సాధించాడు. నాగ్‌పూర్‌కు చెందిన 13 ఏళ్ల యశ్‌ చావ్డే ఇంటర్‌ స్కూల్‌ క్రికెట్‌ టోర్నమెంట్‌లో చెలరేగిపోయాడు. బౌండరీలు , సిక్సర్లతో ప్రత్యర్థి జట్టును మట్టికరిపించాడు. 178 బంతుల్లోనే 508 పరుగులు అందుకున్నాడు. నాటౌట్‌గా కూడా నిలిచాడు. రోజుల తరబడి సాగే టెస్ట్‌ మ్యాచ్‌ల్లో ఇటువంటి రికార్డు సాధిస్తే ఆశ్యర్యపోనక్కర్లేదు. కేవలం 40 ఓవర్లలోనే ఈ రికార్డును కైవసం చేసుకున్నాడు.

యశ్‌ ఇన్నింగ్స్‌లో 81 ఫోర్లు, 18 సిక్సులు ఉన్నాయి. భారత్‌లో ఇంటర్‌ స్కూల్‌ క్రికెట్‌ టోర్నీల్లో ఇదే వ్యక్తిగత స్కోరు కావడం విశేషం. అండర్‌ 14 క్రికెట్‌ టోర్నీలో ఈ అరుదైన స్కోరు నమోదు చేశాడు. లిమిటెడ్‌ ఓవర్ల క్రికెట్‌గా చావ్డే రికార్డుకెక్కాడు. చావ్డే ప్రాతినిద్యం వహిస్తున్న సరస్వతీ విద్యాలయ టీమ్‌ 40 ఓవర్లలో వికెట్‌ నష్టపోకుండా 714 పరుగులు చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement