Sunday, May 19, 2024

ఏపీలో కొత్తగా 79 మందికి క‌రోనా

అమరావతి, ఆంధ్రప్రభ: ఏపీలో కొత్తగా 79 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 14,516 శాంపిల్స్‌ పరీక్షించగా 79 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. అత్యధికంగా పశ్చిమ గోదావరి జిల్లాలో 13, తూర్పు గోదావరి జిల్లాలో 11 చొప్పున కేసులు నమోదు అయ్యాయి. అనంతపురం 9, చిత్తూరు 5, గుంటూరు 9, వైఎస్‌ఆర్‌ కడప 4, కృష్ణా 8, కర్నూలు 1, నెల్లూరు 3, ప్రకాశం 7, విశాఖపట్నం 7, విజయనగరం జిల్లాల్లో 2 చొప్పున కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి.

శ్రీకాకుళంలో ఎలాంటి కేసులు నమోదు కాలేదు. ఇప్పటి వరకు 3 కోట్ల 31 లక్షల81 వేల 869 శాంపి ల్స్‌ పరిశీలించగా 23 లక్షల 18 వేల 417 మందికి పాజిటివ్‌ సోకింది. ఇందులో 23 లక్షల 02,625 మంది పూర్తిగా రికవరీ అయ్యారు. ప్రస్తుతం 1,063 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement