జులై నెలలో అనేక ముఖ్యమైన ఆర్థిక మార్పులు వస్తాయి. వీటిలో పాన్ ఆధార్ లింక్ పెనాల్టిd, డీ మ్యాట్ కెవైసి గడువు , కొత్త క్రెడిట్ కార్డు నియామకాలు, కొత్త ఎన్పిఎస్ రిస్క్ ప్రొఫైలింగ్, క్రిఎ్టో టిడిఎస్ ఉన్నాయి. జులై ఒకటో తేదీన అమలులో రానున్న ఐదు డబ్బు మార్పులను ఇక్కడ చూడండి. రాబోయే నెలలో వ్యక్తులు, పన్ను చెల్లింపు దారుల కోసం అనేక ఆర్థిక మార్పులు తీసుకురావచ్చు.
పాన్ను ఆధార్తో లింక్ చేయనందుకు ….
మార్చి 31లోగా పాన్ను ఆధార్తో లింక్ చేయకపోతే రూ 1000 వరకు జరిమానా విధించబడుతుందని ఆదాయపు పన్ను శాఖ పేర్కొంది. అయితే అలాంటి పాన్ ఐటిఆర్ దాఖలు చేయడానికి, రీఫండ్లు ఇతర ఐటి విధానాలను దాఖలు చేయడానికి మార్చి 2023 వరకు ఒక సంవత్సరం పాటు పని చేస్తుంది. ఇప్పుడు చెడ్డ వార్త ఏమిటంటే , జూన్ 30 2022 నాటికి తమ పాన్ కార్డ్ని బయోమెట్రిక్ ఆధార్తో లింక్ చేసిన పన్ను చెల్లింపుదారులు రూ 500 ఆలస్య రుసుము చెల్లించాల్సి ఉంటుంది. అంతకు మించి పెనాల్టిd రూ 1000కి పెరుగుతుంది.
వర్చువల్ డిజిటల్ ఆస్తుల బదిలీపై..
వర్చువల్ డిజిటల్ ఆస్తుల బదిలీపై 1 శాతం టిడిఎస్ నికర లావాదేవీ విలుపపై విధించబడుతుంది. పన్ను మినహాయించే బాధ్యత ప్రధానంగా ఎక్సేంజీలపై ఉంటుందని ఆదాయపు పన్ను శాఖ తెలిపింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (సిడిబిటి), వర్చువల్ డిజిటల్ అసెట్స్ (విడిఎ) లేదా సైఎ్టో కరెన్సీలపై టిడిఎస్ నిబంధనలపై జారీ చేసింది.
కొత్త క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ నియమాలు..
క్రెడిట్, డెబిట్ కార్డ్ డేటా భధ్రతను నిర్దారించే ప్రయత్నంలో , రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్ బి ఐ) జులై 1 2022 నుండి కార్డ్ లావాదేవీలల టోకనైజేషన్ను అమలు చేస్తుంది. ఆర్బిఐ గత సంవత్సరం టోకనైజేషన్ పరిధిని పెంచింది. కార్డ్ జారీ చేసేవారికి టోకెన్గా వ్యవహరించడానికి అనుమతించింది. సర్వీస్ ప్రొవైడర్లు (టిఎస్పి). వైద్యులు, సోషల్ మీడియా ఇన్ప్లుయెన్సర్లపై ప్రభావం చూపేలా కొత్త టీడీఎస్ రూల్ వ్యాపారం లేదా వృత్తిలో పొందే ప్రయోజనాలకు సంబంధించి కొత్త టిడిఎస్ నిబంధన వర్తింప జేయడంపై ఆదాయపు పన్ను శాఖ ఇటీవల మార్గదర్శకాలను జారి చేసింది. అటువంటి అనుమతులు నగదు రూపంలో లేదా వస్తు రూపంలో లేదా పాక్షికంగా ఈ రూపాల్లో ఉండవచ్చు అని పేర్కొంది. కొత్త నిబంధన జులై 1 నుంచి అమల్లోకి వస్తుంది. వైద్యులు, సోషల్ ఇన్ప్లూయెన్సర్లపై ప్రభావం చూపేలా కొత్త టిడిఎస్ రూల్ వ్యాపారం లేదా వృత్తిలో పొందే ప్రయోజనాలకు సంబంధించి కొత్త టిడిఎస్ నిబంధన వర్తింప జేయడంపై ఆదాయపు పన్ను శాఖ ఇటీవల మార్గదర్శకాలను జారీ చేసింది. అటువంటి అనుమతులు నగదు రూపంలో లేదా వస్తు రూపంలో లేదా పాక్షికంగా ఈ రెండు రూపాల్లో ఉండవచ్చు అని పేర్కొంది. కొత్త నిబంధన జులై 1 నుంచి అమల్లోకి వచ్చింది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.