Monday, April 29, 2024

ఇండియాలో కరోనా దెబ్బకు కొత్తగా 4120 మంది బలి

దేశంలో క‌రోనా కేసులు అదే స్థాయిలో నమోదు అవుతున్నాయి. గ‌డిచిన 24 గంట‌ల్లో 3,62,727 కేసులు కొత్తగా నమోదు అయ్యాయి. అలాగే మరోవైపు 4120 మంది మృతి చెందారు. అలాగే గడిచిన 24 గంటల్లో 3,52,181 మంది కరోనా నుంచి కొలుకున్నారు. ఇక మొత్తం దేశంలో ఇప్పటివరకు దేశంలో మొత్తం న‌మోదైన కేసుల సంఖ్య 2.37 కోట్లకు చేరుకోగా మృతి చెందిన వారి సంఖ్య 2.58 ల‌క్ష‌లకు చేరుకుంది. అలాగే యాక్టివ్ కేసులు 37.10 ల‌క్ష‌లు ఉన్నాయి.

గ‌త 24 గంట‌ల్లో దేశ‌వ్యాప్తంగా 18.64 ల‌క్ష‌ల మందికి క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు నిర్వ‌హించిన‌ట్టు ICMR తెలిపింది. వీటితో క‌లిపి ఇప్ప‌టిదాకా 30.94 కోట్ల శాంపిల్స్ ప‌రీక్షించిన‌ట్టు పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement