మెక్సికో లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దక్షిణ రాష్ట్రమైన ఓక్సాకాలో బుధవారం ఈ ఘటన చోటు చేసుకుంది. పర్వత ప్రాంతం గుండా బస్సు వెళ్తున్న సమయంలో లోయలో పడిపోవడంతో ఈ ప్రమాదం జరిగింది
ఈ ప్రమాదంలో 27 మంది మరణించారని పోలీసులు తెలిపారు. 17 మంది తీవ్రంగా గాయపడినట్లు అధికారులు తెలిపారు. ప్రమాదానికి మెకానికల్ వైఫల్యమే కారణం అని అనుమానిస్తున్నారు. గాయపడిన వారిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వెల్లడించారు. పర్వతాలు, మలుపులు ఉంటే రియోట్ ప్రాంతం అయిన మాగ్డలీన పెనాస్కో పట్టణంలో ఈ ప్రమాదం జరిగింది