Wednesday, May 1, 2024

2002 Riot case – తీస్తా సెతల్వాద్‭కు హైకోర్టు షాక్ … వెంట‌నే లొంగిపోవాల‌ని ఆదేశం..

అహ్మ‌దాబాద్ – 2002లో గుజరాత్‌లో జరిగిన అల్లర్లకు సంబంధించిన కేసుల్లో యాక్టివిస్ట్ తీస్తా సెతల్వాద్‭కు గుజరాత్ హైకోర్టు షాక్ ఇచ్చింది. ఆ అల్లర్లకు సంబంధించిన కేసుల్లో సాక్ష్యాధారాలను ఆమె కల్పించి, సృష్టించారని నమోదైన కేసులో ఆమెకు సాధారణ బెయిలు మంజూరు చేసేందుకు హైకోర్టు శనివారం నిరాకరించింది. అంతే కాకుండా.. ఆలస్యం చేయకుండా లొంగిపోవాలని ఆమెను కోర్టు ఆదేశించింది.

సమయంలో రాష్ట్రంలో జరిగిన అల్లర్లకు సంబంధించిన కేసుల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సహా మరికొందరిని ఇరికించేందుకు తీస్తా సెతల్వాద్ ప్రయత్నించారని కేసు నమోదైంది. అయితే గుజరాత్ అల్లర్లలో అప్పటి ముఖ్యమంత్రి నరేంద్ర మోదీ, తదితరుల ప్రమేయం లేదని ప్రత్యేక దర్యాప్తు బృందం క్లీన్ చిట్ ఇచ్చింది.. దీనిపై జ‌కియా సుప్రీంకోర్టు జకియా పిటిషన్ దాఖాలు చేయ‌గా గత ఏడాది జూన్ 24న తోసిపుచ్చింది. ఆ మర్నాడే అంటే జూన్ 25ర‌ తీస్తా సెతల్వాద్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఆమె బెయిల్ పై విడుద‌ల‌య్యారు.. దీనిపై ప్ర‌భుత్వం కోర్టును ఆశ్ర‌యిచండంతో నేటి తాజా విచారణ అనంతరం జస్టిస్ నిర్జర్ దేశాయ్ నేతృత్వంలోని హైకోర్టు ధర్మాసనం తీర్పు చెప్తూ, తీస్తా సెతల్వాద్ బెయిలు దరఖాస్తును డిస్మిస్ చేసింది. ఆలస్యం చేయకుండా వెంటనే లొంగిపోవాలని ఆమెను ఆదేశించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement