Tuesday, April 30, 2024

Temple | 14 రోజుల్లో 2.05 కోట్లు.. రికార్డు స్థాయిలో అప్పన్న హుండీ ఆదాయం

విశాఖపట్నం, ప్రభన్యూస్‌ బ్యూరో : దేశంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న సింహాచలం శ్రీ వరాహాలక్ష్మీ నృసింహస్వామి దేవస్థానానికి భక్తులు సమర్పించిన కానుకల ద్వారా పెద్ద మొత్తంలో ఆదాయం లభించింది. ఈ మేరకు మంగళవారం ఆలయ ఇవో వి.త్రినాధరావు ఆధ్వర్యంలో అధికారులు, సిబ్బంది , స్వచ్చంద సంస్థల ప్రతినిధులు ఆలయ హుండీలను తెరిచి భక్తులు సమర్పించిన కానుకలు లెక్కించారు.

14 రోజులకు రూ.2,05,72,705లు లభించగా బంగారం, వెండి కానుకలు కూడా పెద్ద మొత్తంలో భక్తులు హుండీల్లో వేశారు. అంతేకాకుండా పలువురు భక్తులు విదేశీయ డాలర్లు సమర్పించారు. హుండీల లెక్కింపు కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ శ్రీనివాసరాజు, ఏఇఓలు భ్రమరాంబ, రమణమూర్తి, రమేష్‌, నరసింహరాజు, దేవదాయశాఖ అధికారులు హుండీల లెక్కింపులో పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement