Sunday, May 5, 2024

Farmer couples: గ‌ణ‌తంత్ర వేడుక‌కు ప్రత్యేక అతిథులుగా రైతు దంప‌తులు…1500మందికి కేంద్రం ఆహ్వానం

దేశ రాజధాని ఢిల్లీ నగరంలో ఈ నెల 26న జరిగే గణతంత్ర దినోత్సవాలకు రైతు దంప‌తుల‌ను ప్రత్యేక అతిథులుగా కేంద్రం ఆహ్వానించింది. 1,500 మంది రైతు దంపతులకుకేంద్ర ప్రభుత్వం ఆహ్వాపం పంపించింది.

గణతంత్ర దినోత్సవ వేడుకలకు రైతు దంపతులను ప్రత్యేక అతిథులుగా ఆహ్వానించడం ఇదే తొలిసారి. వ్యవసాయోత్పత్తుల సంఘాల ప్రతినిధులు, ప్రధాన మంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి, చిన్న తరహా నీటిపారుదల పథకాల లబ్ధిదారులు వీరిలో ఉన్నారు. వ్యవసాయ శాఖ మంత్రి అర్జున్‌ ముండా వీరికి విందు ఇవ్వనున్నారు. గత ఏడాది స్వాతంత్య్ర దినోత్సవాలకు దాదాపు 500 మంది రైతులను ప్రత్యేక అతిథులుగా కేంద్ర ప్రభుత్వం ఆహ్వానించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement