Thursday, May 2, 2024

Train Accident – బంగ్లాదేశ్ లో ఘోర రైలు ప్రమాదం …15 మంది మృతి… వంద‌మందికి పైగా గాయాలు

డాకా – బంగ్లాదేశ్‌లో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రాథమిక సమాచారం మేరకు ఈ ఘటనలో 15 మంది వరకు మృతి చెందగా, 100 మంది వరకు గాయపడ్డారు. ఈ ఘటనలో మృతులు, గాయపడిన వారి సంఖ్య పెరిగే ప్రమాదం ఉందని తెలుస్తోంది. ఏఎఫ్‌పీ సమాచారం మేరకు బైరబ్ ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. అయితే ఓ గూడ్స్ రైలు… ప్రయాణికులతో కూడిన మరో రైలు పైకి దూసుకెళ్లడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ రెండు రైళ్లు ఎదురెదురుగా వస్తున్నాయి. ప్రయాణికులు ఉన్న రైలులోని రెండు బోగీలు పట్టాలు తప్పాయి. ఘటన జరిగిన ప్రాంతం ఢాకాకు 60 కిలో మీటర్ల దూరంలో ఉంది. బంగ్లాదేశ్‌లో సరిగ్గా లేని సిగ్నల్ వ్యవస్థ, నిర్లక్ష్యం, పాత ట్రాక్స్ వల్ల తరుచూ రైలు ప్రమాదాలు జరుగుతుంటాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement