Friday, May 3, 2024

12వేల సామూహిక వివాహ‌లు – వ‌ధువు ఖాతాలో రై.35వేలు

60జిల్లాల్లో సామూహిక వివాహ‌లు జ‌రిగాయి. కాగా ఈ వివాహాల పెళ్ళిళ్ల ద్వారా 12వేల జంట‌లు ఒక్క‌ట‌య్యాయి. ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లో ఈ సామూహిక వివాహాలు జ‌ర‌గ‌డం విశేషం. మతాలకు అతీతంగా జరిగిన ఈ వివాహాల సందర్భంగా ప్రభుత్వం ఒక్కో వధువు ఖాతాలో రూ. 35 వేల చొప్పున జమ చేసింది. రెండో విడత సామూహిక వివాహాలు ఈ నెల 17న నిర్వహించనున్నట్టు అధికారులు తెలిపారు. లక్నోలో జరిగిన వివాహ వేడుకలో పాల్గొన్న రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి అసిం అరుణ్ మాట్లాడుతూ.. పేద కుటుంబాలకు చేయూత ఇవ్వడంతోపాటు వరకట్న దురాచారానికి అడ్డుకట్ట వేసేందుకే ప్రభుత్వం ఈ సామూహిక వివాహ కార్యక్రమం చేపట్టినట్టు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement