Friday, May 3, 2024

సంగారెడ్డి : రైతులకు మేలు చేసింది టీఆర్ఎస్ సర్కార్ మాత్రమే : మంత్రి హరీష్ రావు

ఎవరో వచ్చి తెలంగాణలో రైతులకు ఏం న్యాయం జరిగిందని మాట్లాడుతున్నారు, ఇక్కడికొచ్చి మొసలి కన్నీరు కారుస్తున్నారు అంటూ వైఎస్‌ షర్మిల పార్టీ ప్రకటనపై మంత్రి హరీష్‌ రావు అన్నారు. తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకొస్తానని వైఎస్‌ షర్మిల చేసిన ప్రకటనపై తీవ్రంగా స్పందించారు. సంగారెడ్డి జిల్లా కంది మండలం చిదురుప్ప గ్రామంలో   రైతు వేదికను ఈ రోజు ప్రారంభించిన హరీష్‌ రావు  విూడియాతో మాట్లాడుతూ, షర్మిల కొత్త పార్టీ ఏర్పాటుపై మాట్లాడుతూ,  ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ న్యాయం చేస్తారట అంటూ అన్యాపదేశంగా విమర్శలు గుప్పించారు.  టీఆర్‌ఎస్‌ వచ్చిన తరువాతే రాష్ట్రంలో  మంచినీటికి బాధ లేదని మంత్రి హరీష్‌ రావు పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement