Monday, April 29, 2024

షర్మిల పార్టీ ప్రకటనకు ముహూర్తం ఖరారు?

తెలంగాణలో వైఎస్ షర్మిల పార్టీ ప్రకటనకు ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 9న షర్మిల పార్టీ పేరును ప్రకటించనున్నట్లు విశ్వసనీయవర్గాల ద్వారా తెలుస్తోంది. ఖమ్మం జిల్లాలో లక్ష మంది వైఎస్ఆర్ అభిమానులు, తన మద్దతుదారుల మధ్య షర్మిల పార్టీని ప్రకటించాలని నిర్ణయించారు. పార్టీ ప్రకటన అంశంపైనే ఆమె లోటస్ పాండ్‌లో జిల్లాల వారీగా, నియోజకవర్గాల వారీగా ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నారు. షర్మిల ప్రకటించనున్న పార్టీకి ‘వైఎస్ఆర్ టీపీ’ అనే పేరు పెట్టనున్నట్లు సమాచారం.

2004లో మే 14న వైఎస్ఆర్ తొలిసారిగా సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన నేపథ్యంలో తొలుత ఆమె ఆరోజునే కొత్త పార్టీ స్థాపిస్తారని ప్రచారం జరిగింది. ఆరోజున కుదరకపోతే జూలై 8న వైఎస్ఆర్ జయంతి సందర్భంగా పార్టీ ప్రకటన ఉంటుందని అభిమానులు భావించారు. కానీ ఏప్రిల్ 9న పార్టీని ప్రకటించి మే తొలివారంలో పార్టీ ఆఫీస్‌కు శంకుస్థాపన చేస్తారని ప్రస్తుతం ప్రచారం జరుగుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement