Friday, May 3, 2024

వాషింగ్టన్ : కరోనా మృతులకు సంతాపంగా అమెరికా జాతీయ పతాకం అవనతం

అమెరికాలో కరోనా కేసుల సంఖ్య, కరోన మృతుల సంఖ్య ప్రపంచ దేశాలలోనే అత్యధికంగా ఉంది. మహమ్మారి దెబ్బకు అగ్రరాజ్యం కోలుకోలేని విధంగా దెబ్బతింది. ఆ దేశంలో కరోనా కారణంగా మరణించిన వారి సంఖ్య 5 లక్షలకు పైనే. అలాగే 2 కోట్లకు పైగా కరోనా బారిన పడ్డారు. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు బైడెన్ కరోనా మృతులకు సంతాప సూచకంగా అమెరికా జాతీయ పతాకాన్ని ఐదు రోజుల పాటు అవనతం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. దేశ వ్యాప్తంగా అన్ని కార్యాలయాలపై ఉన్న జాతీయ పతాకాన్ని అవనతం చేయాలని పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement