Friday, April 26, 2024

భారత్ తో డే నైట్ టెస్ట్ – ఇంగ్లాండ్ 27/2

భారత్ ఇంగ్లాండ్ మధ్య నాలుగు టెస్టుల సిరీస్ లో భాగంగా గుజరాత్ లోని మొతేరా స్టేడియంలో జరుగుతున్న మూడో టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ కడపటి వార్తలందేసరికి తొలి ఇన్నింగ్స్ లో రెండు వికెట్ల  నష్టానికి 27 పరుగులు చేసింది. భారత్ బౌలర్లు అక్షర్ పటేల్, ఇషాంత్ శర్మ చెరో వికెట్ పడగొట్టారు. ఓపెనర్ సిబ్లిని ఇషాంత్ శర్మ ఔట్ చేయగా, బెయిర్ స్ట్రోను అక్షర్ పటేల్ పెవిలియన్ కు పంపాడు. సిబ్లి డకౌట్ కాగా, బెయిర్ స్ట్రో కూడా పరుగుల ఖాతా తెరవకుండానే పెవిలియన్ కు చేరాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement