Friday, May 3, 2024

బీజేపీ గూటికి మెట్రో శ్రీధరన్

ఇంజనీరింగ్ లెజెండ్, మెట్రో శ్రీధరన్ బీజేపీ గూటికి చేరనున్నారు. కేరళ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆయన బీజేపీ గూటికి చేరనుండటం విశేషం. కేరళ అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని బీజేపీ మరో మూడు రోజులలో ప్రారంభించనున్నది. విజయ యాత్ర పేరిట బీజేపీ ఎన్నికల ప్రచారాన్ని ఆదివారం నుంచి ప్రారంభించనుంది. ఆ సందర్భంగా శ్రీధరన్ కమలం గూటికి చేరనున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పారు. దేశానికి బీజేపీ గొప్ప సేవలు అందిస్తోందని ఆయన పేర్కొనన్నారు. పార్టీ నిర్ణయిస్తే ఎన్నకలలో పోటీకి కూడా వెనుకాడనని ఆయన చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement