Friday, May 3, 2024

న్యూఢిల్లీ : అమిత్ షా తిరుపతి పర్యటన రద్దు

కేంద్ర హోంమంత్రి అమిత్‌షా తిరుపతి పర్యటన రద్దు అయ్యింది. ఈ నెలలో దక్షిణాది రాష్ట్రాల సీఎంల సదస్సుకు అమిత్‌ షా హాజరుకావాల్సి ఉండగా అకస్మాత్తుగా పర్యటన రద్దు అయ్యింది. ఈనెల 4, 5 తేదీల్లో దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశాన్ని నిర్వహించాలని తలపెట్టారు. దానికి సంబంధించి తమినాడు, కేరళ, కర్ణాటక, తెలంగాణ, ఆంధప్రదేశ్‌ రాష్టాల్ర ముఖ్యమంత్రులకు సమాచారం వెళ్లింది. అయితే అకస్మాత్తుగా అమిత్‌షా తిరుపతి పర్యటన రద్దు అయ్యింది. అలాగే ముఖ్యమంత్రుల సమావేశం రద్దు అయినట్లు అధికారిక ప్రకటన వెల్లడైంది. అమిత్‌ షా పర్యటన రద్దుపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement