Wednesday, May 15, 2024

నేనే సీఎం అయ్యుంటే టీడీపీ ఖాళీ అయ్యేది: మంత్రి పెద్దిరెడ్డి

విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం ప్రజాప్రతినిధులు రాజీనామా చేయాలన్న టీడీపీ డిమాండ్‌లో అర్థం లేదని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యాఖ్యానించారు. రాజీనామాలు చేసినంత మాత్రాన స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగుతుందా అని ప్రశ్నించారు. పంచాయతీ ఎన్నికల్లో ఓడిపోయిన చంద్రబాబు ఆవేశంతోనే ఇలా మాట్లాడుతున్నారని పెద్దిరెడ్డి అన్నారు. తానే సీఎం అయ్యుంటే ఈపాటికి టీడీపీ మొత్తం ఖాళీ అయ్యేదని.. చంద్రబాబు మాత్రమే మిగిలేవారని మాట్లాడారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం అన్ని రాజకీయ పక్షాలను, ట్రేడ్ యూనియన్‌లను జగన్ ఢిల్లీకి తీసుకువెళ్తానని చెప్పారని.. కానీ టీడీపీ హయాంలో చంద్రబాబు ఏ సమస్యపై అయినా అఖిలపక్షం ఏర్పాటు చేశారా అని ప్రశ్నించారు. మున్సిపల్ ఎన్నికల్లోనూ తమ పార్టీ 90 శాతం విజయం సాధిస్తుందని మంత్రి పెద్దిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement