Friday, May 3, 2024

ఓటుకు నోటు కేసులో ఉన్న వ్యక్తి అధికారంలోకి వస్తాడా?: మంత్రి వేముల

టీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మండిపడ్డారు. సీఎం కేసీఆర్ నుంచి అధికారాన్ని లాక్కుంటామని చెప్పడంపై ఎద్దేవా చేశారు. ఓటుకు నోటు కేసులో ఉన్న రేవంత్ రెడ్డి… కేసీఆర్ నుంచి అధికారాన్ని తీసుకుంటానని మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. ఎవరో ఇస్తేనో, లేక లాక్కుంటేనో అధికారం రాదని… ప్రజలు ఆశీర్వదిస్తే వస్తుందని అన్నారు. ఓటుకు నోటు కేసులో రెడ్ హ్యాండెడ్ గా దొరికిన రేవంత్ ఒక దొంగ అని వ్యాఖ్యానించారు.

ఇదే సమయంలో బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌పై కూడా ఆయన మండిపడ్డారు. బండి సంజయ్ ఎందుకోసం పాదయాత్ర చేస్తున్నారని ప్రశ్నించారు. అర్హులందరికీ రూ. 2 వేల పెన్షన్ ఇస్తున్నందుకు పాదయాత్ర చేస్తున్నారా? అని ఎద్దేవా చేశారు. ఉచిత్ విద్యుత్, రైతుబంధు, కేసీఆర్ కిట్లు ఇస్తున్నందుకు చేస్తున్నారా? అని ప్రశ్నించారు.

ఇది కూడా చదవండి: మాజీ ఎంపీ కొండాకు బండి సంజయ్ పరామర్శ

Advertisement

తాజా వార్తలు

Advertisement