Friday, May 10, 2024

అహ్మదాబాద్ : టీమ్ ఇండియా 145 ఆలౌట్

ఇంగ్లాండ్ తో ఇక్కడ జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో టీమ్ ఇండియా 145 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ లో 112 పరుగులకు ఆలౌట్ అయిన సంగతి తెలిసిందే. ఓవర్ నైట్ స్కోరు 99/3తో రెండో రోజు బ్యాటింగ్ చేపట్టిన ఇండియా…ఇంగ్లండ్ బౌలర్ల ధాటికి కకావికలమైంది. బ్యాట్స్ మన్ పెవిలియన్ కు క్యూ కట్టారు. ముఖ్యాంగా లియాచ్, రూట్ బౌలింగ్ కు భారత్ బ్యాట్స్ మన్ వద్ద సమాధానమే లేకుండా పోయింది.  భారత బ్యాట్స్ మన్ లో ముగ్గురు డకౌట్ అయితే, ఐదుగురు మాత్రమే రెండంకెల స్కోరు చేయగలిగారు. రోహిత్ శర్మ 66 టాప్ స్కోరర్ గా నిలిచాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement