Saturday, July 27, 2024

కోల్ కతా : తృణమూల్ అధినేత్రితో ఆర్జేడీ నేత తేజస్వి ప్రసాద్ భేటీ నేడు

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలతో ఆయా రాష్ట్రాలలో రాజకీయ సందడి ఆరంభమైంది. బీహార్ అవతల కూడా ఉనికిని చూపాలని ప్రయత్నిస్తున్న ఆర్జేడీ పశ్చిమ బెంగాల్ లో తృణమూల్ కాంగ్రరెస్ తో పొత్తు పెట్టుకోనుంది. ఇప్పటికే ఆసోంలో పోటీకి దిగుతామని ఆ పార్టీ ప్రకటించిన సంగతి తెలిసిందే. భావ సారూప్యత కలిగిన పార్టీలతో కలిసి పోటీలో దిగాలని ఆ పార్టీ భావిస్తున్నది. అందులో భాగంగా పశ్చిమ బెంగాల్ లో కూడా ఆర్జేడీ ఎన్నికల బరిలో దిగే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఆ రాష్ట్రంలో తృణమూల్ కాంగ్రెస్ తో ఆర్జేడీ పొత్తు పెట్టుకునే అవకాశాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. ఆ ప్రయత్నాలలో భాగంగానే  ఆర్జేడీ నాయకుడు తేజస్వి ప్రసాద్ తృణమూల్ అధినేత్రితో ఈ రోజు భేటీ కానున్నారు. అలాగే అసోంలో ఇప్పటికే ఆర్జేడీ ఆల్ ఇడియా యునైటెడ్ డెమొక్రటిక్ ఫ్రంట్ తో కలిసి పోటీలు ఉండనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement