Sunday, April 28, 2024

తిరుమ‌ల‌లో కొన‌సాగుతున్న భ‌క్తుల ర‌ద్దీ.. శ్రీ‌వారి ద‌ర్శ‌నానికి 20 గంట‌ల స‌మ‌యం..

క‌లియుగ ప్ర‌త్య‌క్ష దైవ‌మైన శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామి వారి ద‌ర్శ‌నానికి తిరుమ‌ల‌కు భ‌క్తులు పోటెత్తారు. భ‌క్తుల కోసం ఏర్పాటు చేసిన కంపార్ట్మెంట్ల‌లో భ‌క్తులు వేచిఉన్నారు. భక్తులు శిలాతోరణం వరకూ క్యూలైన్‌లో వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటల సమయం ప‌డుతోంద‌ని ఆల‌య అధికారులు తెలిపారు. శుక్రవారం స్వామి వారిని 63,512 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.72 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. స్వామివారికి 35,549 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement