Thursday, May 9, 2024

భగవన్నామమే అఖండ రక్షణ

ఓంకారంలా ఈశ్వరుడు ఒక్కడే. భగవంతుడు సర్వత్రా ఉన్నాడు. మనందరికీ ఆయనే తండ్రి అని చెప్పే గురునానక్‌ సిక్కుమత స్థాపకులై, ఏకేశ్వరోపాసనను ప్రబోధించి, కుల వ్యవస్థను వ్యతిరేకించారు. భగవన్నామమే అఖండ రక్షణగా నిలుస్తుందని లోకానికి ఉపదేశించిన గురు నానక్‌ పదిమంది సిక్కు గురువులలో ప్రధ ములు. గురునానక్‌ దేవ్‌. పాకిస్తాన్‌లోని ప్రస్తు తం లాహూర్‌ సమీపంలోని తల్వాండీ గ్రామంలో (నన్కానా సాహబ్‌)లో నానక్‌ దేవ్‌ కార్తీక పౌర్ణమి పుణ్యదినాన 1469 నవంబర్‌ 29న హిందూ కుటుంబంలో జన్మించారు. హిందూ ఇస్లామియా మత గ్రంథాలను చదివి, అవగాహన చేసుకుని, రెండు మతాలకు భిన్నమైన సిక్కు మతాన్ని స్థాపించారు. సిక్కు మతం ఏకేశ్వరోపాసక మతం. సిక్కులు ఏక్‌ ఓంకార్‌ (ఏకైక దేవుడు)ని విశ్వసిస్తారు. నానక్‌దేవ్‌ అనంతరం ఈ గురు పరంపర కొనసా గుతున్నది. నానక్‌ తండ్రి కళ్యాణ్‌ చంద్‌దాస్‌ కలుమెహతాగా సుపరిచితులై, ప్రభు త్వంలో భూ రెవెన్యూ వ్యవహారాల గుమాస్తాగా పనిచేసే హిందూ పట్వారీ. తల్లి మాతాత్రిపుర, అక్క బీబీ నాన్కీ, నానక్‌దేవ్‌ బాల్యం నుండే ప్రశ్నించే, ఆలోచించే తత్వం కలవారు. చిరుప్రాయంలోనే మతపరమైన ఉపనయనం చేసి, జంధ్యం వేయబోగా తిరస్కరించి, అంతకంటే భగవంతుని నిజ నామాన్ని హృదయంలో ధరిస్తామని, భగవన్నామం యజ్ఞోపవీతం నూలుపోగులా తెగిపోవడం, మట్టిలో కలిసిపోవడం ఉండక, అఖండంగా రక్షణ కలిగిస్తుందని వాదించారు. అత్యంత చిన్న వయసు నుండి అక్క బీబీనాన్కీ తమ్మునిలో భగవంతుని జ్యోతిని చూడగా, ఈ రహస్యాన్ని ఎవరితోనూ ఆమె పంచుకోలేదు. ఆమె నానక్‌జీ తొలి శిష్యురాలిగా పేరొందారు. బాల్యంలోనే హిందూ మతంలోని తాత్వికతకు ఆకర్షితులై జీవిత రహస్యాల అన్వేషణకై ఇల్లు వదిలారు. ఈ క్రమంలోనే నానక్‌దేవ్‌ ముఖ్య తాత్వికులైన కబీర్‌, రవిదాస్‌లను కలుసుకున్నారు. బతాలాకు చెందిన వ్యాపారి మూల్‌చంద్‌ చోనా కూతురు సులేఖినిని వివాహమాడారు. శ్రీచంద్‌, లక్ష్మీదాస్‌ అనే కుమారులు వారికి కలిగారు. 28 ఏళ్ళ వయసులో నానక్‌ ఒక ఉదయం నది స్నానం, ధ్యానానికి వెళ్ళగా, మూడు రోజులు ఎవరికీ కన్పించలేదు. తిరిగివచ్చి, దేవుని పవిత్రాత్మను నింపుకున్నానని ప్రకటించారు. అనంతరం ”హిందువూ లేడు, ముస్లిమూ లేడు” అని మత సామరస్య బోధనలను వ్యాప్తి చేయడం ప్రారంభించారు. ఆ తర్వాత నాలుగు ప్రధాన దిశల్లో టిబెట్‌ దక్షిణాసియాలోని పలు ప్రాంతాలు, అరేబియా, మక్కా, బాగ్దాద్‌, ముల్తాన్‌ తదితరాలలో ఉదాసీలనే పేరున భగవంతుని సందేశాన్ని ప్రబోధిస్తూ, ప్రయాణాలు సాగించారు. నానక్‌ జీవిత చరమాంకంలో ఉచిత ప్రసాదం లభించిన కర్తార్‌పూర్‌లో జీవించారు. తాను తీసుకునే ఆహారాన్ని కుల, మత, ధన బేధం లేకుండా పంచుకునేవారు. పొలాలలో పనిచేసి, జీవితం గడిపిన ఆయన డబ్బు జేబు వరకే ఉండాలని అది హృదయాన్ని తాకకుండా చూసుకుంటేనే సమస్యలకు దూరంగా ఉండగలమని బోధించిన గొప్ప తత్వవేత్త.

Advertisement

తాజా వార్తలు

Advertisement