Friday, May 10, 2024

శ్రీశైలంలో శాస్రోక్తంగా సుబ్రహ్మణ్య పూజలు

శ్రీశైలం, ప్రభ న్యూస్ : శ్రీశైలంలో సుబ్రహ్మణ్య స్వామికి విశేష పూజలు నిర్వహించారు. లోక కల్యాణం కోసం కృత్తికా నక్షత్రాన్ని పురస్కరించుకుని దేవస్థానం ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం ఆలయ ప్రాంగణంలోని శ్రీసుబ్ర హ్మణ్యస్వామి ( కుమారస్వామి)కి విశేష పూజలను నిర్వహించడం గమనార్హం. ప్రతి మంగళవారం, కృత్తికానక్ష త్రం, షష్ఠి తిథి రోజులలో శ్రీ సుబ్ర హ్మణ్యస్వామికి ఈ విశేష అభిషేకం, పూజాదికాలు దేవస్థానం సేవగా నిర్వహిస్తారు. కుమారస్వామికి పూజలు జరపడం వలన లోక కల్యాణమే కాకుండా ప్రతి ఒక్కరికి ఉద్యోగ, వ్యాపార, వ్యవహారాలలో ఆటుపోట్లు తొలగి ఆయా పనులు సక్రమంగా జరుగుతాయన్నది భక్తుల నమ్మకం. సుబ్రహ్మణ్యస్వామి అనుగ్రహంతో శత్రుబాధలు, గ్రహపీడలు, దృష్టి దోషాలు మొదలైనవి తొలగిపోతాయి. అలాగే సంతానం కోసం పూజించేవారికి తప్పక సంతాన భాగ్యం లభిస్తుందని చెప్పబడుతోంది. ఈ అభిషేకానికి ముందుగా దేశం శాంతిసౌభాగ్యాలతో విలసిల్లాలని, ప్రకతివైపరీత్యాలు సంభవించకుండా సకా లంలో తగినంత వర్షాలు కురిసి, పంటలు బాగా పండాలని, పాడి సమృద్ధిగా ఉండాలని, జనులకు ఆయురారోగ్యా లు కలిగి వారికి అకాలమర ణాలు రాకుండా ఉండాలని, దేశంలో అగ్ని ప్రమాదాలు, వాహన ప్రమాదాలు మొదలైనవి జరగ కుండా ఉండాలని, అన్ని సామాజిక వర్గాల ప్రజలు సుఖ శాంతులతో ఉండాలంటూ అర్చకస్వా ములు సంకల్పాన్ని పఠించారు. తరువాత కార్యక్రమం నిర్విఘ్నంగా జరిగేందుకు మహా గణపతిపూజ జరిపి, అనంతరం శ్రీసుబ్రహ్మణ్య స్వామివారికి అభిషేకము, సుబ్రహ్మణ్య అష్టోత్తరము చేసిన అనంతరం సుబ్రహ్మణ్యస్తోత్రము పారాయణలు చేశారు. సుబ్రహ్మణ్య స్వామి అభిషేకంలో స్వామివారికి పంచామతాలైన పాలు , పెరుగు, తేనే, నెయ్యి, కొబ్బరినీళ్లు వివిధ పండ్ల రసాలైన దానిమ్మ, కమలా, ద్రాక్ష, అరటి మొదలైన వాటితో అభిషేక కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా వివిధ పళ్ల రసాలతో చేసే అభిషేకంతో ఎంతో ఫలితం ఉంటుందని ఆగమాలు చెబుతున్నాయి .

Advertisement

తాజా వార్తలు

Advertisement