Friday, April 26, 2024

రుషికొండలో శ్రీవారి ఆలయం.. నేటి నుంచి దర్శనాలు

విశాఖపట్నం, ప్రభ న్యూస్‌ బ్యూరో: పరిపాలనా రాజధానిగా పేరుగాంచిన మహావిశాఖలో ఇక తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం భక్తులకు అందుబాటులోకి వచ్చింది. రుషికొండ ప్రాంతంలో సువిశాలంగా సుమారు రూ.28 కోట్లతో తిరుమల తిరుపతి దేవస్థానం ఈ ఆలయాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించింది. ఈ నేపధ్యంలో బుధవారం శాస్త్రోక్తంగా వైధిక క్రతు వులు నిర్వ హించడం జరిగింది. నూతన ఆలయంలో మహాకుం భాబి షేకం నిర్వ హించారు. వేద పండితులు వేద మంత్రోశ్చరణలు వల్లిస్తుండగా మృదుమధుర మంగళవా యిద్యాల మధ్య ఉదయం 5.30 నుంచి 8 గంట ల వరకు శ్రీవారికి సుప్రభాతం, కుంభారాధన, నివేదన, హోమం, మహాపూర్ణాహుతి నిర్వహించారు. అనంతరం కుంభాలను, ఉత్సవ మూర్తులను ఊరేగింపుగా ఆయా సన్నిధిల్లోకి వేంచేయిం పచేశారు. ఇక వృషభ లగ్నంలో ఆగమోక్తంగా మహా కుంభాబిషేకం నిర్వహించారు. తరు వాత బ్రహ్మఘోష, వేద శాత్తుమొర, ద్వజా రోహణం, అర్చక బహు మానం జరిగింది. వేద పండితులు, అర్చకులు పూజలు అనంతరం విశాఖ శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి ఆలయ ఉత్తర ద్వార ఉద్ఘాటనం చేశారు. మద్యాహ్నం నిత్య కైంక ర్యాలు నిర్వహించారు. సాయంత్రం శ్రీనివాస కళ్యాణం వైభవోపే తంగా జరిపించారు. అనంతరం ఉత్సవ మూర్తులు ఊరేగింపు, ద్వజా వరోహణం, నిత్యకైంకర్యాలు జరిపి రాత్రికి ఏకాంత సేవ ఘనంగా నిర్వహించారు. నూతన ఆలయంలో గురువారం నుంచి శ్రీ వెంకటెశ్వరస్వామి దర్శనభాగ్యం భక్తులకు అందుబాటులోకి రానుంది.
లోక కళ్యాణమూర్తి వెంకటెశ్వరస్వామి:స్వరూపానందేంద్ర
ఈ సందర్భంగా విశాఖ శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి అనుగ్రహభాషణం చేశారు. ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌. జగన్‌ మోహన్‌ రెడ్డి కోరిక మేరకు, టిటిడి చైర్మన్‌ శ్రీ వై.వి. సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయం విశాఖలో నిర్మించినట్లు- తెలిపారు. వైఖానస ఆగమానుసారం శ్రీవారి ఆలయ నిర్మాణం జరిగిందన్నారు. ఆలయంలో మూలమూర్తి సాక్షాత్తు తిరుమల వెంకన్న తిరిగి వచ్చాడా అన్నంత అద్భుతంగా ఉందన్నారు. వేదాలు ఆగమాలు దేవాలయాల ప్రాముఖ్యతను తెలియజేస్తున్నాయని చెప్పారు. ధ్వజ స్తంభం సమస్త జీవులకు ఆలయానికి వెన్నుముక్క వంటిదన్నారు. ముఖమండపం స్థూలశరీరం, అర్ధ మండపం సూక్ష్మ శరీరం, గర్భా లయం హృదయం వంటిదన్నారు. గర్భాలయంలోని స్వామివారిని దర్శిస్తే సమస్త పాపాలు తొలగి, కోరిన కోర్కెలు నెరవేరుతాయని వివరించారు. విశాఖ శారదా పీఠం లోకంలోని సమస్త జీవులు సుభిక్షంగా ఉండాలని, సనాతన హైందవ ధర్మ పరిరక్షణకు పనిచేస్తోందన్నారు. శ్రీ వారి అనుగ్రహంతో రాష్ట్రం బాగుండాలని, ప్రత్యేకంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో పిల్లలకు విద్యాబు ద్ధులు, పెద్ద పరిశ్రమలు రావడం ద్వారా యువత ఉపాధి అవకాశా లతో ఎదగాలని శ్రీవారిని ప్రార్థించినట్లు తెలిపారు. అనంతరం టిటిడి ఛైర్మన్‌ వై.వి.సుబ్బారెడ్డి మాట్లాడుతూ, విశాఖకు మరింత ఆధ్యాత్మిక శోభ కల్పించేందుకు రెండు సంవత్సరాల క్రితం రూ.26 కోట్లతో శ్రీవారి ఆలయ నిర్మాణం చేపట్టామన్నారు. మార్చి 18వ తేదీన అంకురార్పణతో ప్రారంభించి ఐదు రోజుల పాటు ఋత్వికులు వైదిక కార్యక్రమాలు నిర్వహించినట్టు చెప్పారు. సనాతన హైందవ ధర్మ ప్రచారంలో భాగంగా కాశ్మీర్‌ నుండి కన్యాకుమారి వరకు శ్రీవారి ఆలయాలు నిర్మిస్తున్నామని చెప్పారు. ఒరిస్సాలో శ్రీవారి ఆలయం పూర్తయిందని, రాబోయే రెండు నెలల్లో ఆలయం ప్రారంభిస్తామ న్నారు. అమరావతిలో కూడా శ్రీవారి ఆలయం పూర్తిచేసి త్వరలో ప్రారంభించనున్నట్లు తెలిపారు. కాశ్మీర్‌లో 60 ఎకరాల విస్తీర్ణంలో శ్రీవారి ఆలయ నిర్మాణం జరు గుతోందని, ఆరు నెలల్లో పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టామన్నారు. హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా గిరిజన, మత్సకార, బడుగు బలహీనవర్గాల ప్రాంతాలలో రాబోయే రెండేళ్ళలో 1000 శ్రీవారి ఆలయాలు నిర్మిం చేందుకు చర్యలు చేపట్టామని వివరించారు. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తం శెట్టి శ్రీనివాస్‌ మాట్లాడుతూ, ఈరోజు విశాఖ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించవలసిన రోజన్నారు. తిరుమల నుండి స్వామివారు మనందరినీ ఆశీర్వదించడానికి ఇక్కడికి వచ్చారన్నారు. శ్రీవారి అనుగ్రహంతో విశాఖ మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement