Wednesday, May 1, 2024

”మాసానాం మార్గశీర్షోహం”

”బృహత్సామ తథా సామ్నాం గాయత్రీ ఛందసామహిమ్ మాసానాం మార్గశీర్షోహం ఋతూనాం కుసుమాకర:”
”వేదాలలో సామవేదాన్ని, ఛందస్సుల్లో గాయత్రీ ఛం దస్సును, మాసాలలో మార్గశిర మాసాన్ని, రుతువులలో వసంత రుతువును” అంటూ సాక్షాత్తూ శ్రీ కృష్ణ పరమాత్ముడు భగవద్గీతలోని విభూతి యోగంలో చెప్పిన శ్లోకమిది. కార్తికే యుడు, కాలభైరవుడు, దత్తాత్రేయుడు, వంటివారితో పాటు స్వయం భగవానుముఖత: ప్రకటితమైన శ్రీమద్భగవద్గీత అవతరించిన మాసం మార్గశిరం. విభూతి యోగంలోనే ”నక్షత్రాణ మహం శశీ” అన్నా రు. చంద్రుడు తారానాధుడు. ”మాసాలలో మార్గశీర్షం- నక్ష త్రాలలో చంద్రుడు”- మృగశిరా నక్షత్రయుక్త పౌర్ణమాసి మార్గశీర్షం- ఈ మాసమునకు అధినాధుడు చంద్రుడు. మృగశిరా నక్షత్రమునకు కూడ చంద్రుడే అధినాధుడు. ఇంకే నక్షత్రానికి చంద్రుడు ఆధినాధుడు కాడు. నక్షత్రములు మగశిరాదిగ నెలలు, మార్గశీర్షమాదిగా లెక్కించెడివారు. అందువలన మార్గశిర మాసమునకు భగవానుడు ప్రాధా న్యత కలిగించారు. విషవత్తు అంటే రాత్రి దివసముల సమాన కాలము. మృగశిరా నక్షత్రముతో మనపూర్వ రుషులు విషువత్తు నిర్ణయం గావించారు. మృగశిరా విషువత్తుతో మొదలయ్యే కాలం మార్గశీర్షం. మార్గశిర మాసానికి ఇంకొక ప్రాముఖ్యం ఉంది. పరమ పవిత్రమైన గోదాదేవి వ్రతం ఆరంభించి ఉపనిషత్తుల్యము లైన పాశురములను అనుగ్రహించినది. ”మార్గళంగల్‌ మదినిజైన్ద నన్నాళాల్‌ మార్గశిరము వచ్చినది. పూర్ణచంద్రు నితో కూడిన శుక్లపక్షము వైష్ణవ మాసము- మార్గశీర్షము అనగా భగవంతుని పొందుదారి- ”నారాయణనే నమక్కే” అని శరణాగతి. భాగవతం దశమస్కంధంలోనే భగవంతుని వెదకెడి ద్రోవలో హమంతంలో ప్రధమ మాసంలో నందప్రజ కుమా రికలు భగవత్‌ ప్రసాదం ”హవిష్యం భుంజాన:” కాత్యాయనీ వ్రతం చేయుటకు పూనుకొన్నారని ప్రమాణం ఉన్నది. తెలుగు మాసములలో మార్గశిరం తొమ్మిదవ మాసం. మృగశిరా నక్షత్రంతో కూడిన పౌర్ణమి గల మాసం మార్గ శిరం. మార్గశీర్షం పరమ పవిత్రం. నక్షత్ర మండలంలో మూడు నక్షత్రాలు శీర్షాకతిని పోలి ఉన్నందున ”మృగశీర్ష” అని పేరు వచ్చింది. రాశి అధిపతి గురుడు, సూర్యచంద్రుల సమాగమమును సంతరించుకున్న ఈ మాసం విష్ణు ఆరాధ నతో మోక్షదాయిని అయింది. ఒకప్పుడు మార్గశిరంలోనే సంవత్సరారంభం ఉండినట్లు వాడకంలో ఉంది. భాగవత దశమ స్కంధంలో బమ్మెర పోతనామాత్యుడు, గోపభామ లు ”మార్గశీర్షవ్రతం” జరిపారని పేర్కొన్నాడు. కోటిసూర్య గ్రహణ స్నాన తుల్య ఫలాన్ని ఇచ్చే మార్గశిర శుక్ల ప్రతిపద, ఉమామహేశ్వర, అనంత తృతీయ, యోగ తృతీయ, నామ తృతీయ, అనబడే శుక్ల తృతీయ నాడు రంభా వ్రతం, చవితి నాడు వినాయక చతుర్థి వ్రతం, పంచమి నాడు దక్షిణాత్యుల నాగపూజ, శివుని రెండవ కుమారుడు, కుమార స్వామి, కార్తికేయుడు స్కందుడు, గుహుడు, షణ్ముఖుడైన సుబ్రహ్మణ్య స్వామిని కొలిచే సుబ్బారాయుడి షష్టినాడు స్కంద వ్రతం, బ్రహ్మచారి పూజ, సర్పపూజ, సప్తమి సూర్య ఆరాధన, నందా సప్తమీ వ్రతం, అష్టమినాడు కాల భైరవ పూజ, నవమి నాడు నందిని దేవి పూజ, దశమినాడు ఆరోగ్య వ్రతం, మోక్షదైకాదశి, సౌఖ్య దైకాదళి అని పిలువబడే ఏకా దశి విష్ణు ఆరాధన, త్రయోదశి హనుమత్‌ వ్రతం, ద్వాదశి నాడు తెలుగు వారి ఇలవేలుపు అయిన వేంకటేశ్వరుని పుష్క రిణికి తీర్ధదినంగా, త్రయోదశిన గోదావరి ప్రాంత హనుమజ్జ యంతిగా, చతుర్దశి దత్తాత్రేయ ఆరాధన పౌర్ణమినాడు దత్త జయంతి, చంద్రపూజ, యమారాధన, కృష్ణపక్ష ద్వాదశి మల్లన్న ద్వాదశిగా, చతుర్ధశి మాస శివరాత్రి, వ్రత నిష్టా పరులకు ఆచరణలో ఉన్నాయి. కార్తిక పౌర్ణమి నుండి మార్గశిర పౌర్ణమి వరకు యమ ధర్మరాజు కోరలు తెరుచుకొని ఉంటాడు, ఈ రోజుల్ని యమ దంష్ట్రులుగా చెబుతారు. ఈ కాలంలో జనం వివిధ ఆనారోగ్య సమస్యలతో బాధపడుతుంటారు. మార్గశిర పౌర్ణమితో ఈ అనేక రకమైన వ్యాధులు, అనారోగ్య సమస్యలు తొలగుతాయి కాబట్టి యముని పట్ల కృతజ్ఞత పూర్వకంగా మార్గశిర పౌర్ణమినాడు యమధర్మ రాజుని ఆరాధిస్తారు. ఈ పౌర్ణమిని కోరల పున్నమి, నరక పౌర్ణ మి అని కూడా పిలుస్తారు. మహర్షి అత్రి, మహా పతివ్రత అన సూయలకు మార్గశీర్ష పౌర్ణమి నాడు గురు స్వరూపంగా త్రిగుణాత్ముడు, త్రిముఖ దేహుడు దత్త రూపంలో జన్మించిన ”దత్తాత్రేయుని జయంతి”ని మహారాష్ట్ర, తెలుగు రాష్ట్రాలలో వైభవంగా భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. ఇవి కాకుండా ధనుర్మాసం, మార్గశిర లక్ష్మీవారం (గురువారం) వ్రతాలు, షష్టీవారాలు ప్రసిద్ధాలు. జ్ఞానమును పెంపొందించే ధనుర్మాసంలో ఓంకారాన్ని ధనువుగా, ఆత్మ ను బాణంగా, బ్రహ్మమును లక్ష్యంగా చేసుకుని, సాధకులు నిర్మల, నిశ్చల మనస్కులై ఏకాగ్రత చిత్తంతో ధ్యానం చేస్తే, త్వరగా లక్ష్య సిద్ధి కలుగుతుందనేది విశ్వాసం.

  • రామ కిష్టయ్య సంగనభట్ల
    9440595494
Advertisement

తాజా వార్తలు

Advertisement