Tuesday, April 30, 2024

లక్ష్మీ నివాసం…!

వైకుంఠంలో ఒకసారి శ్రీమహావిష్ణువు- లక్ష్మీదేవిలు మాట్లాడుకుంటున్నారు. ఉన్న ట్టుండి శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవితో ”ప్రజలలో ఎంత భక్తి పెరిగింది… అందరూ నా కరుణ కోసం ”నారాయణ… నారాయణ” అని నా నామం జపిస్తున్నారు.” అన్నాడు.
పతి మాటలు విన్న లక్ష్మీదేవి వెంటనే ”అది మీకోసం కాదు నా కరుణా కటాక్షం కోసమే మీమీద భక్తి పెరిగింది” అంటుంది.
శ్రీహరి కూడా ఏమాత్రం తగ్గకుండా ”అలా అయితే జనులం తా ”లక్ష్మీ… లక్ష్మీ” అని ఎందుకు జపించటం లేదు” అంటాడు.
”అలా అయితే భక్తులకు ఓ పరీక్ష పెడదాం” అంటుంది లక్ష్మీదేవి.
”సరే” అని వెంటనే నారాయణుడు ఒక బ్రాహ్మణుడి రూపం ధరించి ఒక గ్రామానికి వెళ్ళి ఆ గ్రామాధికారి ఇంటి తలుపు కొడతాడు. గ్రామాధికారి తలుపు తెరిచి, ”మీరు ఎవరు, ఎక్కడ నుండి వచ్చారు?” అని అడుగుతా డు.
”నా పేరు లక్ష్మీపతి. నేను వైకుంఠం అనే వూరి వాడిని. నేను మీ నగరంలో హరికథ చెప్పాలని అనుకొంటున్నాను” అంటాడు.
దానికి గ్రామాధికారి ”అ లాగా మా గ్రామ ప్రజల

మహాభాగ్యం. హరికథ విని పుణ్యం సంపాదించుకొంటారు. మీరు ఇక్కడ ఉన్నంతవరకు మీరు నా ఇంట్లో ఉండండి” అని అంటాడు.
గ్రామంలోని కొందరు వ్యక్తులు సమావేశమై అన్ని సన్నాహాలు చేస్తారు. మొదటి రోజు పదిమంది వస్తారు. రెండవ రోజు, మూడవ రోజు ఆ సంఖ్య మరింత పెరిగి కూర్చోవటానికి కూడా స్థలం లేక నిలబడి భక్తితో వింటూ వుంటారు.
ప్రజల అనన్య భక్తి చూసి నారాయణుడు అమితంగా సంతోషపడి పోతాడు. ఇదంత గమనించిన లక్ష్మీదేవి ఒక వృద్ధురాలిగా మారి ఆ గ్రామానికి వచ్చి అప్పుడే ఇంటికి తాళం వేసి హరికథ కాలక్షేపం కోసం వెళుతున్న ఒక స్త్రీతో ”దాహంగా వుంది నాకు కొంచెం నీళ్లు ఇవ్వవా బిడ్డా” అని అడుగుతుంది.
”అమ్మా, సమయం సాయంత్రం 5.00 అయింది నేను హరికథ వినేందుకు వెళుతు న్నాను” అంటుంది.
”నాకు కొన్ని మంచినీరు ఇవ్వు తల్లి చా లా దాహం వేస్తుంది. నీకు అమితమైన పుణ్యం లభిస్తుంద”ని వృద్ధురాలి రూపంలో వున్న లక్ష్మీమాత దీనంగా అడగగానే కాదనలేక ఆ స్త్రీ తాళం తీసి ఇత్తడి చెంబుతో నీళ్లు తెచ్చి ఇస్తుంది.
లక్ష్మీమాత నీరు తాగి ఆ చెంబు తిరిగి ఆ స్త్రీ చేతికి ఇవ్వగానే ఆ చెంబు బంగారం చెం బుగా మారుతుంది. అది చూసి ఆ స్త్రీ ఆశ్చర్యపోయి రెండు చేతులు జోడించి ”ఎంత మహమగల తల్లివి నీవు. నీకు ఆకలి వేస్తుందేమో వుండు కంచంలో అ న్నం పెడతాను” అని అంటుంది. ఆ కంచం కూడ బంగారంది అవుతుంది అన్న ఆశతో.
”లేదు బిడ్డ నాకు ఆకలిగా లేదు. నీ హరి కథకు సమయం అవుతుంది” అని అక్కడ నుం చి వెళుతుంది.
ఆ స్త్రీ హరికథ కోసం వచ్చి ఈ సంగతి ఆమె చుట్టుపక్కల ఉన్న మొత్తం ఆడవారు అందరికీ చెబుతుంది. అది వింటూనే హరిక థ వింటున్న స్త్రీలందరు మధ్యలోనే లేచి వెళ్లిపోతారు. మరుసటి రోజు నుండి హరికథ కు వచ్చేవారి సంఖ్య గణనీయంగా తగ్గడంతో లక్ష్మీపతి ”భక్తుల సంఖ్య ఎందుకు తగ్గుతూ వచ్చింది” అని అడుగుతాడు.
అప్పుడు ఎవరో ”ఒక మహమ గల తల్లి గ్రామానికి వచ్చింది. ఆమె ఎవరింటికైన వెళ్లి ఏ వస్తువుతో అయినా తాగిన, తినిన ఆ వస్తువు బం గారంగా మారుతుంది. అందువలన భక్తుల సం ఖ్య తగ్గింది” అని అంటాడు. లక్ష్మీదేవి వచ్చిందని నారాయణుడికి అర్థం అవుతుంది.
ఇది వింటూనే ఆ గ్రామాధికారి కూడ అక్క డినుండి మెల్లగా జారుకొని ఆ వృద్ధురాలి దగ్గర కు వెళ్ళి ”అమ్మా, నేను హరికథ నిర్వ#హస్తున్నా ను. అటువంటిది మీరు నా ఇంటిని ఎందుకు విడిచిపెట్టారు” అని అడుగుతాడు.
అప్పుడు లక్ష్మీమాత ”మీ ఇంటికే నేను మొదట వచ్చాను! మీ ఇంట్లో హరికథ చెప్పేవారు వుండటంతో నేను రాలేదు. అతను వెళ్లిపోయా కనే నేను వస్తాను.” అంది.
”ఓస్‌ ఇంతేనా తల్లిd నేనిప్పుడే వారికి ధర్మశాలలో గది ఇస్తాను” అని అక్కడ నుండి తన ఇంటికి వస్తాడు. ఆ రోజున హరికథ అయిన తర్వాత లక్ష్మీపతి తన ఇంటికి వచ్చిన వెంటనే, గ్రామాధికారి ”మహారాజా! మీరు మీ పెట్టేబేడ సర్దుకోండి. ఇప్పటి నుండి మీరు ధర్మశాల లో వుండండి. అక్కడ మీకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి” అంటాడు.
అప్పుడు లక్ష్మీపతి ”హరికథ పూర్తి అయ్యేందుకు ఇంకా రెండు, మూడు రోజులు మిగిలి ఉన్నాయి. ఇక్కడనే ఉంటాను” అంటాడు.
”లేదు… లేదు, మీరు త్వరగా వెళ్లండి. మీ మాట నేను వినను. నేను మరొక అతిథికి వసతి కల్పించాలి” అంటాడు.
ఇంతలో లక్ష్మీమాత వచ్చి, గ్రామాధికారిని ”మీరు కొంచెం బయటకు వెళ్లండి. నేను వారితో మాట్లాడతాను” అంటుంది.
”ప్రభూ! నువ్వు ఇప్పుడు ఒప్పుకుంటావా? నీ భక్తులు నీ కోసం కాదు నాకోసం మీ నామం జపిస్తున్నార”ని అంటుంది నవ్వుతూ.
భగవంతుడు కూడా చిద్విలాసంతో ”అవును ఇదంతా నీ ప్రభావం. కానీ నీవు కూడ ఒ క విషయాన్ని అంగీకరించాలి. నీవు నాకోసం వైకుంఠం విడిచి వచ్చావు. ఎక్కడ అయితే నా కథలు చెబుతారో, భజనలు చేస్తారో ఖచ్చితంగా అక్కడనే నీవూ (లక్ష్మి) వుంటావు” అని చెబు తాడు. ఆ తర్వాత నారాయణుడు ఆ ప్రదేశానికి వీడ్కోలు పలికి వైకుంఠానికి బయలుదేర తాడు. బ్రాహ్మణుడు (నారాయణుడు) వెళ్ళిపోయిన తర్వాత, మరుసటి రోజు ఉదయం గ్రామాధికారి ఇంటి వద్ద గ్రామస్తులంతా గుంపుగా చేరతారు. వారందరి సమక్షంలో లక్ష్మీ దేవి ”ఇక నేను కూడా వెళ్తున్నాను” అంటుంది.
అది విన్న గ్రామస్తులందరూ ”అమ్మా! మీరు మా ప్రతి ఒక్కరి ఇంటికి రావాలని కోరు కుంటున్నాము. కానీ ఇది ఏమిటి మీరు వెళ్ళిపోతాను అంటున్నారు. మేము ఏమైనా తప్పు చేశామా?” అని అడుగుతారు.
”నారాయణుడు ఎక్కడ వుంటే అక్కడనే నా నివాసం. మీరు నారాయణుడిని పం పించారు. అందుకే నేను కూడ ఆయన దగ్గరకు వెళ్ళిపోతున్నాను” అని వైకుంఠం చేరుకుం టుంది. దేవుని స్మరణ ఉన్నచోట. అక్కడ లక్ష్మి నివసిస్తుంది.
లక్ష్మి వెంట పరిగెత్తే వారికి లక్ష్మీ నిలవ దు… లక్ష్మీపతి దొరకడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement