Thursday, April 18, 2024

brutal murder : ప్రియురాలిని మ్యాన్ హోల్ లో పాతరేసిన ప్రియుడు..

ప్రియురాలిని ప్రియుడు చంపి మ్యాన్ హోల్ దాచిపెట్టిన ఘటన తెలంగాణ రాష్ట్రంలోని శంషాబాద్ లో చోటు చేసుకుంది. సదరు ప్రియుడు సాయి కృష్ణను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అప్సర అనే యువతి ఈనెల 3న అదృశ్యమయ్యింది. ఆమె గురించి వెతుకుతున్న క్రమంలో ఈ దారుణ ఘటన వెలుగు చూపింది. ఈ కేసు విచారణలో భాగంగా నిందితుడు సాయికృష్ణను పోలీసులు అరెస్ట్ చేశారు. సాయికృష్ణకు అప్సరతో కొంతకాలంగా వివాహేతర సంబంధం ఉంది. సాయికృష్ణకు గతంలోనే వివాహమైంది.

ఇటీవల అప్సర తనను వివాహం చేసుకోవాలని సాయికృష్ణను పట్టుబట్టడంతో అతను ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఆమెను చంపేసి సరూర్ నగర్ లోని ఓ మ్యాన్ హోల్ లో దాచి పెట్టాడు. విచారణలో ఈ విషయం వెలుగులోకి రావడంతో పోలీసులు సాయికృష్ణను అరెస్ట్ చేశారు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement