Tuesday, May 14, 2024

దివ్య చరణాలే శరణ్యం!

తిరుమల ఆనంద నిలయంలో బ్రహ్మస్థానమనే దివ్య ప్రదే శంలో శ్రీ వేంకటేశ్వరస్వామి ఆరా రూపంలో స్వయం వ్యక్తమూర్తి గా నిలిచి భక్తులను అనుగ్రహస్తారు. తన దివ్య పాదాలే పరమార్థ మని చూపించే వజ్ర కవచ వరదహస్తంతో శోభిల్లే కలియుగ ప్రత్యక్ష దైవాన్ని దర్శించే భక్తుల ఆనందం వర్ణనాతీతం. #హరిపాద సేవతో పాపాలు నశిస్తాయి. గోవిందనామస్మరణ మనోధైర్యాన్ని స్తుంది. శరణాగతవత్సలుడి ముందు శిరస్సువంచిన భక్తుడి మనసు పావ నమై ప్రశాంత నిలయమవుతుంది.
దానవులు, దైత్యులు, నరులు, గంధర్వులు ఎవరైనా ఆ లక్ష్మీ పతి పాదపద్మాలను సేవిస్తేనే పుణ్యాత్ములవుతారని. తన మనసు దివ్యమైన విష్ణుపాదాలను ధ్యానించడంలోనే పరవశించి ఆనంది స్తుందని చదువులలో మర్మమెల్ల గ్రహంచిన ప్రహ్లాదుడు భక్తితత్వా న్ని వివరించాడు. ధర్మార్థ కామమోక్షాలనే నాలుగు విధాలైన పురు షార్ధాలను పొందాలనుకునే వారికి శ్రీహరి పాదపద్మాలను సేవించ డం తప్ప మరో మార్గంలేదు. సాటి లేని శాంతస్వభావుడు సర్వలోక రక్షకుడైన శ్రీహరి భక్తుల హృదయాల్లో ప్రకాశించే పాద పద్మాలు కలవాడని నారదుడు ధ్రువుడికి ఉపదేశించాడు.
ఆది మధ్యాంతాలు లేని విష్ణుపాద.. దర్శనం తమకు శుభాన్ని కలిగిస్తుందని బ్రహ్మాది దేవతలు ఒక సందర్భంలో వెల్లడించారు. అపారమైన భక్తితో శ్రీహరి పాద పద్మాలను సేవిం చే వరం ప్రసాదించమని ఇంద్రుడు ప్రార్ధించాడు. శ్రీకృష్ణ భగవానుడు ప్రాణులందరికీ దేవ తలందరూ నేత అతడి కనుక దివ్య చరణాలపై శిరసు వంచుతారు. శ్రీకృష్ణుడు తనను ఆశ్ర యించిన వారిని ఆదరిస్తాడు. శరణాగతులను రక్షిస్తాడు. కనుక వాసుదేవుడికి ప్రణమిల్లాల పరమేశ్వరుడు హమాలయ శిఖరం మీద మునీంద్రులకు తెలియజేసినట్లు భారతం చెబు తోంది. అంతటి మ#హమాన్విత పాదపద్మాలను మనసులో ప్రతిష్ఠించుకుని ధ్యానించే అవ కాశం లభించిన మానవుడు అత్యంత భాగ్యశీలి.
బాలకృష్ణుడి ప్రచండ తాండవానికి కాళీయుడి తల చితికిపో యింది. కాళియుడు శ్రీకృష్ణుణ్ని శరణువేడి సముద్రంలోకి వెళ్ళిపో యాడు. శరణు కోరినవారిని రక్షించే శ్రీవారి పాదాలే దుష్టులను శిక్షి స్తాయి. ఏడు దీపాలతో కూడిన భూమండలానికి రాజైన అంబరీషు డి మనసు శ్రీహరి పాదాల మీద, మాటలు హరిగుణ సంకీర్తనలపై చూ పులు గోవిందుడి రూపాన్ని తనివితీరా చూడటంపట్ల లగ్నమై ఉండేవంటారు. అంబరీషుడి భక్తితత్పరత అందరికీ అనుసర ణీయం.
భక్తుల ప్రేమబంధానికి చిక్కిన తాను ప్రేమతో వారి వెంటే ఉం టానని, తనను నమ్ముకున్న ఎవరినైనా తాను వదిలిపెట్టనని, తన భక్తులకు తానే దిక్కని శ్రీ మహావిష్ణువు దుర్వాస మహ ర్షికి చెప్పినట్లు భాగవతం వెల్లడిస్తోంది. విష్ణుపాద మందిరం గయలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అక్కడ విష్ణు పాద ముద్రగల రాతిబండను భక్తులు పూజిస్తారు. ఆ క్షేత్రంలో చేసే పితృకార్యాలు ఏడు తరాలను ఉద్ధరి స్తాయని భక్తుల విశ్వాసం బదరీనాథ్‌ దగ్గర చరణ పాదుక అనే ప్రదేశంలో ”ఒక రాతిపై శ్రీమహావిష్ణు వు కాలి అడుగుల ముద్రను దర్శించవచ్చు. భక్తికి మిం చిన శక్తి లేదన్నది నిర్వివాదాంశం. ఎన్నో జన్మల పుణ్యఫలంగా లభించిన మానవజన్మ మ#హమాన్వితమైన శ్రీ#హరి పాదపద్మాలను ఆరాధించడం ద్వారా సార్ధకం కాగలదని గ్ర#హంచాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement