Friday, May 3, 2024

శాస్త్రోక్తంగా కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు

తిరుపతి : శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. అంకురార్పణం సందర్భంగా తెల్లవారుజామున సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి, కొలువు, పంచాంగ శ్రవణం, మూల వర్లకు అభిషేకం నిర్వహించారు. పుణ్యాహవచనం, మృత్సంగ్రహణం, సేనాధిపతి ఉత్సవం అనంతరం శాస్త్రోక్తంగా బ్రహ్మోత్సవాలకు అంకురార్పణం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రత్యేక శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీమతి వరలక్ష్మి, ఏఈవో శ్రీ గురుమూర్తి, సూపరింటెండెంట్‌ శ్రీ చెంగ‌ల్రాయులు, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్ శ్రీ కిరణ్ కుమార్‌ రెడ్డి, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

ధ్వజారోహణం :
ధ్వజారోహణంతో శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం అయ్యాయి. ఇందులో భాగంగా ఉదయం 6.30 నుండి 8.15 గంటల వరకు స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులకు తిరుచ్చి ఉత్సవం జ‌రిగింది. ఉదయం 8.40 నుండి 9 గంటల మధ్య మీన‌ల‌గ్నంలో ధ్వజారోహణ ఘట్టాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. నేటి సాయంత్రం 5 నుండి 6 గంటల వరకు ఊంజల్‌సేవ, రాత్రి 7 నుండి 8 గంటల వరకు పెద్దశేష వాహనసేవ జరుగనున్నాయి. ప్రతిరోజూ ఉదయం 8 నుండి 9 గంటల వరకు, తిరిగి రాత్రి 7 నుండి 8 గంటల వరకు వాహనసేవలు జరుగనున్నాయి. బ్రహ్మోత్సవాల కారణంగా ఆలయంలో అన్ని రకాల ఆర్జితసేవలను టిటిడి రద్దు చేసింది.

బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు :
తేదీ ఉదయం – సాయంత్రం
11-02-2023
ధ్వజారోహణం – పెద్దశేష వాహనం

12-02-2023
చిన్నశేష వాహనం – హంస వాహనం

13-02-2023
సింహ వాహనం – ముత్యపుపందిరి వాహనం

- Advertisement -

14-02-2023
కల్పవృక్ష వాహనం – సర్వభూపాల వాహనం

15-02-2023
పల్లకి ఉత్సవం(మోహినీ అవతారం) – గరుడ వాహనం

16-02-2023
హనుమంత వాహనం – స్వర్ణరథం, గజ వాహనం

17-02-2023
సూర్యప్రభ వాహనం – చంద్రప్రభ వాహనం

18-02-2023
రథోత్సవం అశ్వవాహనం

19-02-2023
చక్రస్నానం ధ్వజావరోహణం

శ్రీ కపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ
తిరుపతి : తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి వార్షిక బ్ర‌హ్మోత్స‌వాల‌కు శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. ఫిబ్ర‌వ‌రి 11 నుండి మార్చి 20వ తేదీ వరకు ఆల‌యంలో బ్రహ్మోత్సవాలు జ‌రుగ‌నున్నాయి. కోవిడ్ అనంతరం మొదటిసారిగా పురవీధుల్లో వాహనసేవలు నిర్వ‌హిస్తారు. అంకురార్ప‌ణం సందర్భంగా సాయంత్రం మూషిక వాహనంపై శ్రీ వినాయకస్వామివారు పురవీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు. ఆ త‌రువాత శాస్త్రోక్తంగా అంకురార్పణం జ‌రిగింది.
ధ్వజారోహణం :
నేటి ఉదయం 8.54 గంటలకు మీన లగ్నంలో ధ్వజారోహణంతో బ్ర‌హ్మోత్స‌వాలు ప్రారంభ‌మ‌య్యాయి. అనంతరం ఉదయం 9.30 నుంచి 11.30 గంటల వరకు పల్లకీ ఉత్సవం, రాత్రి 8 నుంచి 10 గంటల వరకు హంస వాహన సేవ జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా ప్ర‌తి రోజు ఉద‌యం 8 నుండి 10 గంట‌ల వ‌ర‌కు, రాత్రి 8 నుండి 10 గంట‌ల వ‌ర‌కు స్వామి, అమ్మ‌వార్ల‌కు పురవీధుల్లో వాహ‌న సేవ‌లు నిర్వ‌హిస్తారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement