Tuesday, May 21, 2024

ఐశ్వర్యాన్నిచ్చే… మార్గశిర లక్ష్మీవార వ్రతం

కోటి శుభాల మార్గశీర్షం వచ్చేసింది. లోగిళ్లన్నీ లక్ష్మీ కళతో కళకళలాడినట్టే. ఎటు విన్నా ‘లక్ష్మీ నమస్తు భ్యం…’ ఎటు చూసినా ‘నమస్తేస్తు మహామాయే…’ అంటూ ఆ అమ్మను ఆర్తితో స్తుతిస్తూ పూజిస్తారు. శ్రీ మహా విష్ణువుకు ప్రీతిపాత్రమైన ఈ మాసం ఆయన సతీమణి మహా లక్ష్మికీ మక్కువైనదే! ఈ మార్గశిర మాసంలో మహాలక్ష్మిని ఎవరైతే మనస్ఫూర్తిగా ధ్యానిస్తారో, పూజిస్తారో సంవత్సరం లోని మిగిలిన పదకొండు మాసాల్లోనూ వారికి అష్టలక్ష్మీ వైభ వం సమకూరుతుంది. ఈ మాసంలో ప్రధానంగా చెప్పుకోద గింది లక్ష్మీవార వ్రతమే. దీన్నే గురువార లక్ష్మీపూజ అని, లక్ష్మీదేవి నోమని అంటారు.
వ్రతవిధానం
మార్గశిర లక్ష్మీపూజ ఐదు గురువారాలు చేయాలి. ఈ నెలలో గనుక నాలుగే లక్ష్మీవారాలు వస్తే, ఐదవ వారంగా పుష్యమాసం తొలి గురువారం నాడు నోము నోచుకోవాలి. ముందుగా ప్రాత:కాలాన లేచి ఇంటి ముంగిటముగ్గు పెట్టి తలారా స్నానం చేసి పూజామందిరంలో బియ్యం పిండి తో అష్టదళపద్మం ముగ్గు వేసి లక్ష్మీదేవి ప్రతిమను ప్రతిష్ఠించు కోవాలి. మహాగణపతి పూజించి, అనంతరం మహాలక్ష్మికి షోడశోపచార పూజ నిష్ఠగా నిర్వహించాలి. హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం’ అంటూ ప్రార్థన చేసి అమ్మ వారిని ఆవాహన చేసుకోవాలి. ఆసనం, పాద్యం, అర్ఘ్యం, ఆచమనీయం, శుద్ధోదక స్నానం, వస్త్రం, చామరం, చంద నం, ఆభరణం, ధూపం, దీపం, నైవేద్యం, తాంబూలాదులు, కర్పూర నీరాజనం, ”ఓం మహాలక్ష్మీ చ విద్మహ విష్ణుపత్నీ చ ధీమహి తన్నో లక్ష్మీ: ప్రచోదయాత్‌” అంటూ లక్ష్మీగాయత్రి పఠిస్తూ అమ్మవారికి మంత్రపుష్పాన్ని సమర్పించాలి.
అనంతరం ‘సహస్రదళ పద్మస్థాం పద్మనాభ ప్రియాం సతీం’ అనే సిద్ధలక్ష్మీ కవచాన్ని సభక్తికంగా చదువుకోవాలి. తరువాత అష్టోత్తర నామావళి పూజచేసి, మహానైవేద్యం సమర్పించాలి. నైవేద్యానంతరం లక్ష్మీవారవ్రత కథ చెప్పుకు ని అక్షతలు శిరసున ధరించాలి. చివరగా క్షమాప్రార్థన చేయా లి. అమ్మవారికి సమర్పించే మహానైవేద్యం విషయం లో కొన్ని నియమాలు పాటించాలి.
తొలి గురువారం అమ్మవారు పుట్టినవారంగా ప్రఖ్యాత మైంది. కాబట్టి ఈ రోజు నోము సందర్భంగా పులగం నివేదన చేయాలి. రెండవవారం అట్లు, తిమ్మనం, మూడోవారం అప్పాలు, పరమాన్నము నాలుగోవారం చిత్రాన్నము, గారె లు నైవేద్యం పెట్టాలి. ఐదోవారం నాడు అమ్మవారికి పూర్ణం బూరెలను నివేదించాలి. ఆ రోజు ఐదుగురు ముత్తయిదువ లను ఆహ్వానించి వారి కి స్వయంగా వండి వడ్డించాలి. అనం తరం దక్షిణ తాంబూ లాదులిచ్చి వారి ఆశీస్సులు పొందాలి. దీంతో మార్గశిర లక్ష్మీ వ్రతం పూర్తయినట్టే. మంగళగౌరీ వ్రతంలాగ ఉద్యాపన చెప్పే క్రియ ఈ నోములో ఉండదు. ఎందుకంటే మన ఇంట్లో సౌభాగ్యలక్ష్మి నిత్యం విలసిల్లేందు కే ఈ పద్ధతిని పాటించా లనేది పండితుల ఉవాచ.
నియమ నిష్ఠలు కీలకం
ఈ నోము నోచే స్త్రీలు లక్ష్మీవారాల్లో శుచిగా ఉండాలి. తలకు నూనె రాయడం, జుట్టు దువ్వుకోవడం, చిక్కులు తీసు కోవడం నిషిద్ధం. తొలిసంధ్య, మలిసంధ్య నిదురపోకూడదు. నియమనిష్ఠలతో, భక్తిశ్రద్ధలతో ఈ వ్రతాన్ని ఆచరించిన వారి ఇంట లేమి అనే శబ్దం పొడసూపదు. ఐశ్వర్య దేవత వరాలు కురిపిస్తుంది. ఒక్క గురువారాలలోనే కాకుండా ఈ మాసంలోని ప్రతి రోజూ లక్ష్మిని పూజిస్తే పది కాలాలు పచ్చగా వర్ధిల్లవచ్చని పురాణాలు చెబుతున్నాయి. అమ్మవారికి పూలు, పండ్లు, సువాసనలిచ్చే అగరుధూపం, పరిమళద్రవ్యాలు ప్రీతికరం. వీటితో ఆమె అనుగ్రహాన్ని అవలీలగా పొందవచ్చు.
మార్గశిర లక్ష్మీవార వ్రత కథ
పూర్వం కళింగ దేశంలో ఒక బ్రాహ్మణుడు వున్నాడు. అతనికి సుశీల అనే ఒక కూతురు కలదు. ఆమెకు చిన్నతనం లోనే తల్లి చనిపోయినందున సవతితల్లి పిల్లను ఎత్తుకొమ్మని చెబుతూ కొంచెం బెల్లం యిచ్చేది. సుశీల పిల్లలను ఆడిస్తూ ఇంటివద్ద సవతితల్లి మార్గశిర లక్ష్మీపూజ చేయటం చూసి ఆమె కూడా మట్టితో మహాలక్ష్మిని చేసి జిల్లేడు పూలతోను, ఆకులతోను పూజచేసి సవతితల్లి ఇచ్చిన బెల్లం నేవైద్యం పెడుతూ ఆడుకునేది. ఇలా కొన్నాళ్లకు సుశీలకు వివా#హం అయ్యింది. అత్తవారింటికి వెళుతూ తాను తయారుచేసు కున్న లక్ష్మీదేవి మట్టిబొమ్మను తీసుకువెళుతుంది. సుశీల అత్త వారింటికి వెళ్ళిన వెంటనే కన్నవారు నిరుపేదలు అయ్యారు. మెట్టింట మ#హదైశ్వర్యం అనుభవిస్తున్నారు. పుట్టింటివారు కటిక దరిద్రులు అయిన సంగతి తెలిసికొని సుశీల చాలా బాధ పడుతుంది. సవతితల్లి దరిద్రమును భరించలేక కొడుకును పిలిచి ”నాయనా! నీ అక్క ఇంటికి వెళ్లి ఏమైనా డబ్బు తీసు కురా” అని చెప్పి పంపిస్తుంది. సుశీల ఇంటికి తమ్ముడు వెళ్లి వారి దరిద్రం గురించి చెబుతాడు. సుశీల ఒక కర్రను దొలిపిం చి దానినిండా వరహాలు పోసి ఇచ్చింది. ఆ చిన్నవాడు కర్ర ను పట్టుకొని వెళుతుండగా దారిలో కర్ర వదిలేసి వెళ్ళిపోయా డు. ఇంటికి వెళ్ళిన కొడుకుని తల్లి ఏమితెచ్చావని అడుగగా ఏమితేలేదని చెబుతాడు. కొంతకాలం తరువాత సుశీల వారి దరిద్రంలో ఎటువం టి మార్పురాలేదని తెలిసి. ఒక చెప్పులు జత తెప్పించి వాటి లో వరహాలు పోసి కుట్టించి వాటికి గుడ్డ చుట్టి తమ్మునికి ఇచ్చి అది తీసుకువెళ్లి తండ్రికి ఇమ్మని చెబుతుంది. సరే అని తీసుకెళ్లి మార్గ మధ్యలో దాహం వేసి ఒక చెరువు గట్టున మూట పెట్టి నీరు తాగి వచ్చేసరికి వాటిని ఎవరో ఎత్తుకుపోయారు. ఇంటికి వచ్చి తల్లికి చెప్పాడు. సవతితల్లి మళ్ళీ కొన్నాళ్ళకి కొడుకును పంపుతూ ఈసారయిన జాగ్రత్తగా తీసుకురమ్మని చెబుతుంది. అక్కకి ఇంట్లో పరిస్థితి ఇదివరకులానే ఉందని చెబుతాడు. అప్పుడు సుశీల ఒక గుమ్మడి పండు తెప్పించి దాని నిండా వరహాలు నింపి ఆ పండు అమ్మకి ఇమ్మని ఇచ్చింది. సరే అని తీసుకొస్తు సాయం సమయంలో ఒక చెరువు వద్ద గట్టు మీద పెట్టి సాయం సంధ్య వందనం చేస్తున్నాడు. ఇంతలో ఒక బాటసారి వచ్చి పండు బాగుందని తీసుకుపోయాడు. ఆ కుర్రాడు గట్టు మీద పండు లేకపోవడంతో ఏమి చేసే ది లేక ఇంటికి వెళ్ళాడు. తల్లి ఏమి తెచ్చితివి అని అడుగగా జరి గింది చెబుతాడు. కొన్నాళ్ళకి తల్లి పిల్లలని ఇంటిదగ్గర ఉంచి, కూతురు దగ్గరకి వెళుతుంది. తల్లిని చూసి సుశీల వారి దరి ద్రం తెలుసుకొని చింతించి మార్గశిర లక్ష్మీవారం నోము నోచి న ఐశ్వరం వస్తుందని ”అమ్మా ఈ రోజు మార్గశిర లక్ష్మీవారం ఏమీ తినకు మనం వ్రతం చేసుకుందాం” అంటుంది. ఆమె ‘అలానే’ అని. పిల్లలకి చల్ది అన్నం కలుపుతూ నోటిలో ఒక ముద్ద వేసుకుంది. కూతురు వచ్చి ”అమ్మా స్నానం చెయ్‌ వ్రతం చేసుకుందాం” అంది. అప్పుడు జరిగింది తల్లి చెప్పిం ది. ఆ వారం కూతురు మాత్రమే చేసుకుంది. రెండవ వారం సుశీల ”అమ్మా! వ్రతం చేసుకుందాం” అంది. అప్పుడు పిల్లల కి తలకి నూనె రాస్తూ తాను రాసుకుంది. ఆ వారం కూడా వ్రతం వీలు కాలేదు. మరుసటి వారం ”అమ్మా! ఈ వారం అయిన జాగ్రత్తగా ఉండమ”ని చెప్పింది. పిల్లలకి తలదువ్వు తూ తాను దువ్వుకుంది. ఆ వారం కూడా వ్రతం కుదరలేదు. కూతురు నాలుగో వారం ఈసారైనా జాగ్రత్తగా ఉండమని తల్లికి చెప్పి తల్లి ఏ పని చేయకుండా ఉండటా నికి ఒక గోతిలో కూర్చోపెట్టింది. తన పని అయిన తరువాత అమ్మని తీసు కొచ్చి ”స్నానంచేస్తే పూజ చేసుకుందాం” అని పిలవగా తల్లి ”పిల్లలు అరటిపండు తిని నేను కూర్చున్న చోట అరటి తోలు వేశారు నేను తోచక అది తిన్నాను” అని చెప్పింది. అయ్యో అనుకుని కూతురు పూజ చేసుకొని ఐదవ వారం మార్గశిర లక్ష్మీవారం ఆఖరి వారం. అప్పుడు సుశీల తల్లిని తన కొంగుకి కట్టుకొని పని పూర్తి చేసుకొని తల్లితో స్నానం చేయించి వ్రతం చేయించింది. పూర్ణాలు, కుడుములు తల్లితో నైవేద్యం పెట్టించింది. కానీ మహాలక్ష్మీ దూరంగా వెళ్లి పోయిం ది. ”ఏమి అమ్మా.. అలా వెళ్లిపోతున్నావు” అని అడుగగా… లక్ష్మీదేవి ”నీ చిన్నతనంలో నువ్వు బొమ్మలతో ఆడుకుం టుంటే మీ అమ్మ చీపురుతో కొట్టింది. అందుకే వెళ్లిపోతున్నా” అని చెప్పింది. అప్పుడు తన తల్లి చేసిన దానికి క్షమించమని ప్రార్థించింది సుశీల. లక్ష్మీదేవి కరుణించి సుశీలతల్లితో వ్రతం చేయించమని” చెప్పి అదృశ్యం అయింది మహాలక్ష్మి. సుశీల సరే అని మొదటివారం పులగం, రెండవ వారం అట్లు, తిమ్మనం, మూడవ వారం అప్పాలు, పరమాన్నం, నాలుగోవారం చిత్రన్నాం, గారెలు, పుష్యమాసంలో మొదటి వారం పూర్ణాలు వండి తల్లితో నోము చేయించింది. కథా అక్షిం తలు తలమీద వేసుకున్నారు. మహాలక్ష్మి కరుణించింది. అప్పటినుండి ఆమెకు సకల సంపదలు కలుగుతాయి. అంత్య కాలంలో విష్ణు లోకానికి వెళుతుంది. భక్తి తప్పినను ఫలం తప్పదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement