Friday, May 3, 2024

సెప్టెంబరులో శ్రీ కోదండరామాలయంలో విశేష ఉత్సవాలు

తిరుపతి : తిరుపతి శ్రీ కోదండరామాలయంలో సెప్టెంబరు నెల‌లో జరుగనున్న ఉత్సవాల వివరాలిలా ఉన్నాయి. కోవిడ్ – 19 వ్యాప్తి నేప‌థ్యంలో ఆల‌యంలో ఏకాంతంగా ఈ కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తారు.

– సెప్టెంబరు 3, 30వ తేదీల్లో పునర్వసు నక్షత్రం సందర్భంగా ఉదయం 11 గంటలకు శ్రీ సీతారాముల కల్యాణం నిర్వహిస్తారు.

– సెప్టెంబరు 4, 11, 18, 25వ తేదీల్లో శనివారం ఉదయం 6 గంటలకు మూలవర్లకు అభిషేకం, రాత్రి 7 గంటలకు ఊంజల్‌సేవ నిర్వహించ‌నున్నారు.

– సెప్టెంబరు 7న అమావాస్య సందర్భంగా ఉదయం 6.30 గంటలకు సహస్ర కలశాభిషేకం జ‌రుగ‌నుంది.

– సెప్టెంబరు 20న పౌర్ణమి సందర్భంగా ఉదయం 9 గంటలకు అష్టోత్తర శతకలశాభిషేకం చేపడతారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement