Saturday, May 18, 2024

టీటీడీ బోర్డు ఎక్స అఫిషియో సభ్యుల ప్రమాణ స్వీకారం

తిరుమల, ప్రభన్యూస్‌ : టీటీడీ బోర్డు ఎక్స్‌ అఫిషియో సభ్యురాలిగా వాణిమోహన్‌, సభ్యులుగా మరో నలుగురు ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ, కమిషనర్‌ జి. వాణిమోహన్‌ టీటీడీ ధర్మకర్తల మండలి ఎక్స్‌ అఫిషియో సభ్యురాలిగా, జీవన్‌రెడ్డి, మూరంశెట్టి రాములు, కాటసాని రాంభూపాల్‌రెడ్డి, బూదాటి లక్ష్మీనారాయణ సభ్యులుగా సోమవారం ఉదయం తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రమాణస్వీకారం చేశారు. ఆలయంలోని బంగారు వాకిలి వద్ద టీటీడీ అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి వీరితో ప్రమాణ స్వీకారం చేయించారు. శ్రీవారిని దర్శించుకున్న అనంతరం రంగ నాయకుల మండపంలో వేద పం డితులు ఆశీర్వ చనం చేశారు. శ్రీవారి తీర్థ ప్రసాదాలు, చిత్రపటం అందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటి ఈవో రమేష్‌బాబు, డిప్యూటి ఈవో (జనరల్‌) సుధా రాణి, రిసెప్షన్‌ డిప్యూటి ఈవో లోకనాథం, పేష్కార్‌ శ్రీహరి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement