Monday, April 29, 2024

ఓటీటీలోనూ అద‌ర‌కొడుతున్న విశాల్ మార్క్ ఆంటోనీ..

కోలీవుడ్ స్టార్‌ హీరో విశాల్‌ నటించిన లేటెస్ట్ మూవీ ‘మార్క్‌ ఆంటోని’. టైమ్‌ ట్రావెల్‌ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ యాక్షన్‌ మూవీ సెప్టెంబర్‌ 15న విడుదలైన తమిళంతో పాటు తెలుగులోనూ భారీ వసూళ్లు సాధించింది. బాక్సాఫీస్ ద‌గ్గ‌ర‌ ఏకంగా వంద కోట్లకు పైగా వసూళ్లు రాబ‌ట్టింది మార్క్‌ ఆంటో మూవీ.

కాగా, ఈ నెల అక్టోబ‌ర్ 13న ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ అయిన అమెజాన్ ప్రైమ్ వీడియోస్ లో స్ట్రీమింగ్ వ‌చ్చింది ఈ మూవీ. ఇప్పుడీ సినిమా ఓటీటీలోనూ అదరగొడుతోంది. అమెజాన్ ప్రైమ్ వీడియోస్ లో రికార్డు స్థాయిలో వ్యూస్‌ సొంతం చేసుకుంటోన్న మార్క్‌ ఆంటోని సినిమా ఇండియాలోనే టాప్‌ ట్రెండింగ్‌లో నిలవడం విశేషం.

Advertisement

తాజా వార్తలు

Advertisement