Friday, May 17, 2024

వరుణ్ కు స్టీల్ ప్లాంట్ సెగ

దేశంలో ఎక్కడైనా ఏదైనా జరిగితే సినీ స్టార్స్ సోషల్ మీడియా ద్వారా స్పందిస్తూ ఉంటారు. అయితే ఒరిస్సా లో జరిగిన అగ్ని ప్రమాదం పై మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ స్పందించారు. ఒరిస్సాలో జరిగిన ఘటన ఎంతో బాధ పెట్టింది. అడవులు మనకు ఎంతగానో అవసరం. వాటిని కాపాడుకోవడానికి మన వంతు కృషి చేద్దాం. మంటలను అదుపులోకి తీసుకువచ్చిన ఫ్రంట్ లైన్ యోధులకు ధన్యవాదాలు అంటూ ట్వీట్ చేశారు. ఇక్కడ వరకు అంతా బాగానే ఉన్నప్పటికీ వరుణ్ చేసిన ట్వీట్ కొంత మంది నెటిజన్స్ కు నచ్చలేదు.

మీ సినిమాలు ఏపీ లో రిలీజ్ చేస్తారు. కానీ ఏపీలో స్టీల్ ప్లాంట్ విషయమై గత కొన్ని రోజులుగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. దానిపై ఎందుకు స్పందించలేదు అంటూ ప్రశ్నిస్తున్నారు. వెళ్లి ఒరిస్సాలో సినిమాలు రిలీజ్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ ప్రజల డబ్బులు కావాలి కానీ వైజాగ్ స్టీల్ ప్లాంట్, అమరావతి రైతుల గురించి మాత్రం వద్దా అంటూ వరుణ్ పై మండిపడుతున్నారు. ఇక విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి మద్దతుగా మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా స్పందించిన సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement