Friday, May 3, 2024

ఇద్దరు ముద్దుగుమ్మలతో వైష్ణవ్ తేజ్ రొమాన్స్

ఉప్పెన సినిమాతో సూపర్ డూపర్ హిట్ ని అందుకున్నాడు మెగా హీరో వైష్ణవ్ తేజ్. ప్రస్తుతం ఈ యంగ్ హీరో క్రిష్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. అలాగే గిరిశయా దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేస్తున్నాడు. ఇక ఈ సినిమాలో కేతిక శర్మ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కూడా ఇటీవల స్టార్ట్ అయింది. అయితే తాజా సమాచారం ప్రకారం. ఈ సినిమాలో మరో హీరోయిన్ శోభితా రానా ను తీసుకున్నట్లు తెలుస్తోంది.

రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా సెట్ లో శోభిత జాయిన్ అయ్యారు. ఇక మీడియా ఇంట్రడక్షన్ సమయంలో శోభితా మాట్లాడుతూ… ఇంత పెద్ద సినిమాలో భాగమైనందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. తెలుగు చిత్రపరిశ్రమలో భాగం కావడానికి ఇది గొప్ప సమయం అని నేను అనుకుంటున్నాను… అంటూ చెప్పుకొచ్చారు శోభిత. కన్నడలో శోభితా నటిగా మంచి పేరు తెచ్చుకున్నారు

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement