Saturday, April 20, 2024

సీఎం కేసీఆర్ ను కలిసిన గెల్లు శ్రీనివాస్

హుజూరాబాద్‌ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిశారు. పార్టీ టికెట్‌ కేటాయించినందుకు సీఎంకు ధన్యవాదాలు తెలిపారు. శుక్రవారం ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ను కలిసిన ఆయన.. పుష్పగుచ్ఛం ఇచ్చి కృతజ్ఞతలు తెలిపి, ఆశీర్వాదం తీసుకున్నారు. కాగా, సోమవారం(ఆగస్ట్ 16) దళిత బంధు పథకాన్ని హుజురాబాద్ లో సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. హుజూరాబాద్‌ సభలోనే గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌ను నియోజకవర్గ ప్రజలకు కేసీఆర్‌ పరిచయం చేయనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement