Wednesday, May 1, 2024

మహేష్ సరసన ఇద్దరు ?

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన అతడు, ఖలేజా సినిమాలు బాక్సాఫీస్ వద్ద విజయం సాధించలేక పోయినప్పటికీ జనాలపై మాత్రం ప్రభావం చూపించాయి. అయితే ఈ సినిమాకు సంబంధించి ఓ వార్త ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది.

ఈ సినిమాలో మహేష్ బాబు సరసన ఇద్దరు హీరోయిన్స్ ఉంటారట. ఇద్దరి పాత్రలు కూడా పూర్తి నిడివితో ఉంటాయని తెలుస్తోంది. అందులో ఒకరు పూజా హెగ్డే పేరు వినిపిస్తోంది. మరొకరిని బాలీవుడ్ నుంచి తీసుకుంటారని సమాచారం. ఈ సినిమాతో పాటు పరశురామ్ దర్శకత్వంలో మహేష్ సర్కారు వారి పాట సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement