Saturday, April 27, 2024

బోర్డు మీద పేరు మారుస్తారేమో, చ‌రిత్ర‌ను మార్చ‌లేరు.. పూన‌కాలు తెప్పిస్తున్న వీరసింహారెడ్డి ట్రైల‌ర్‌

నందమూరి బాలకృష్ణ అభిమానులు ఆత్రంగా ఎదురుచూస్తున్న వీరసింహారెడ్డి ట్రైలర్ వ‌చ్చేసింది. ఏపీలోని ఒంగోలు అర్జున్‌ ఇన్‌ఫ్రా గ్రౌండ్‌లో జరుగుతున్న ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ట్రైలర్‌ను ఇవ్వాల కొద్ది సేప‌టి క్రిత‌మే లాంచ్‌ చేశారు. ‘‘సీమలో ఏ ఒక్కడూ కత్తిపట్టకూడదు. నేనొక్కడినే కత్తిపట్టా. పరపతి కోసమో పెత్తనం కోసమో కాదు.. ముందు తరాలునాకిచ్చిన బాధ్యత. నాది ఫ్యాక్షన్‌ కాదు.. సీమ మీద ఎఫెక్షన్‌’’ అంటూ గూస్‌ బంప్స్ తెప్పించే బాలయ్య మార్క్‌ డైలాగ్స్‌ తో ట్రైలర్ ప్రారంభమైంది.

- Advertisement -

ఇక.. వీరసింహారెడ్డి పుట్టింది పులిచెర్ల.. చదివింది అనంతపురం.. రూలింగ్ కర్నూల్‌ అంటూ రాయలసీమ బ్యాక్‌ డ్రాప్‌లో చెప్పే డైలాగ్స్‌ నందమూరి అభిమానులతోపాటు మూవీ లవర్స్ అందరికీ పూనకాలు తెప్పించేలా ఉన్నాయి. గోపీచంద్ మ‌లినేని దర్శకత్వం వహిస్తున్న ఈ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌లో కన్నడ యాక్టర్ దునియా విజయ్ ముసలి మడుగు ప్రతాప్‌ రెడ్డిగా విలన్‌ పాత్రలో కనిపించబోతున్నాడు.

మైత్రీ మూవీ మేకర్స్ అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో శృతిహాసన్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. వరలక్ష్మి శరత్‌కుమార్‌, హనీ రోజ్‌, చంద్రికా రవి, పీ రవిశంకర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వీరసింహారెడ్డి సంక్రాంతి కానుకగా జనవరి 12న థియేటర్లలో సందడి చేయనున్నాడు. రాయలసీమలో కొన్ని వాస్తవ ఘటనల నేపథ్యంలో ఈ మూవీ రాబోతోంది. కాగా ఇప్పటికే విడుదలైన వీరసింహారెడ్డి గ్లింప్స్ వీడియో బాలకృష్ణ అభిమానులకు కావాల్సిన అన్ని ఎలిమెంట్స్‌ తో సినిమా ఉండబోతుందని చెబుతోంది.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement