Thursday, April 25, 2024

ఘంటసాల రెండవ కుమారుడు మృతి

ప్రముఖ గాయకుడు స్వర్గీయ ఘంటసాల రెండవ కుమారుడు రత్నకుమార్ మృతి చెందారు. చెన్నై ఆస్పత్రిలో అనారోగ్యం తో చికిత్స పొందుతున్న ఆయన కు రెండు రోజుల క్రితమే నెగిటివ్ వచ్చింది. అయితే చాలా కాలంగా ఘంటసాల రత్నకుమార్ కిడ్నీ సమస్యలతో డయాలసిస్ పై ఉన్నారని కుటుంబ సభ్యులు తెలిపారు. కాగా రత్నకుమార్ డబ్బింగ్ ఆర్టిస్ట్ గా ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు. తన తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ గాయకుడు కావాలని తపించారని కానీ బ్రేక్ రాలేదని చెబుతుండేవారు రత్నకుమార్.

అదే సమయంలో తమిళ చిత్రం కంచి కామాక్షి కి తెలుగులో డబ్బింగ్ చెప్పానని… ఆ సినిమా 100 రోజులు ప్రదర్శనలు రావడం వరుస అవకాశాలు వచ్చాయని తెలిపారు. అలానే అమేజింగ్ వ‌ర‌ల్డ్ రికార్డ్స్, తమిళ‌నాడు బుక్ ఆఫ్ రికార్డ్స్ లోనూ ఆయ‌న పేరు న‌మోదైంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement