Saturday, May 18, 2024

కోర్ట్ రూమ్ డ్రామాగా ‘గార్గి’.. రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన మేక‌ర్స్

సాయి పల్లవి ప్రధాన పాత్రలో రూపొందుతున్న చిత్రం గార్గి. ఎమోషనల్ కోర్ట్‌రూమ్ డ్రామాగా తెర‌కెక్క‌నున్న ఈ సినిమాకి గౌతం రామచంద్రన్ దర్శకత్వం వహించ‌గా, రవిచంద్రన్ రామచంద్రన్, ఐశ్వర్యలక్ష్మి, థామస్ జార్జ్ సంయుక్తంగా నిర్మించారు. కాగా, తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు మేక‌ర్స్. జులై 15న థియేటర్లలో విడుదల కానున్న‌ట్టు ఈ రోజు (శ‌నివారం) సోషల్ మీడియాలో వెల్లడించారు.

కాగా, ఈ సినిమా తమిళంతో పాటు తెలుగు, కన్నడ భాషల్లో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తెలుగులో చివరిసారిగా విరాట పర్వం మూవీలో కనిపించిన సాయి పల్లవి, నెక్ట్స్​ ప్రాజెక్ట్ లో రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వంలో శివకార్తికేయన్‌తో కలిసి కనిపించనుంది. ఈ చిత్రాన్ని కమల్ హాసన్ ‘‘రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్’’ సంస్థ నిర్మించింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement