Saturday, May 4, 2024

బాక్సాఫీస్ వద్ద కోట్లు కొల్లగొడుతున్న లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్.. మూడు రోజుల కలెక్షన్స్ ఎంతంటే !

అశ్విన్ బాబు, నందితా శ్వేత జంటగా నటించిన లేటెస్ట్ మూవీ హిడింభ. ఈ సినిమాకి అనీల్ కన్నెగంటి దర్శకత్వం వహించారు. అయితే రిలీజ్ అయిన రెండు రోజుల్లో 3.36 కోట్ల గ్రాస్ సాధించిన హిడింభ.. శనివారం దాదాపు 2.33 కోట్ల గ్రాస్ వసూలు చేసి బాక్సాఫీస్ వద్ద బ్రహ్మాండంగా నిలిచింది.

- Advertisement -

ఇక మేకర్స్ తాజాగా మేక‌ర్స్ అందించిన లేటెస్ట్ అప్‌డేట్ ప్రకారం, ఈ సినిమా మూడు రోజుల రన్‌లో మొత్తం కలెక్షన్లు దాదాపు 5.69 కోట్ల గ్రాస్‌గా ఉన్నట్టు తెలిపారు. శ్రీ విఘ్నేష్ కార్తీక్ సినిమాస్ (SVK సినిమాస్) బ్యానర్‌పై గంగపట్నం శ్రీధర్ ఈ సినిమాని నిర్మించారు. వికాస్ బాదిసా స్వరాలు సమకూర్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement