Saturday, May 4, 2024

క్రిష్ పవన్ కళ్యాణ్ సినిమాకు 150 కోట్లు ? కాదు అంతకు మించి !!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే చారిత్రిక సినిమాలు చేయడంలో క్రిష్ టాలీవుడ్ లో ఓ దిట్ట అనే చెప్పాలి. కాగా క్రిష్ గతంలో చేసిన సినిమాల కంటే కాస్త ఎక్కువగానే ఎఫెక్ట్ పెడుతున్నాడట ఈ సినిమాపై. దాదాపుగా 150 కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్ తో ఈ సినిమాను ఏం రత్నం నిర్మిస్తుండగా అందులో 50 కోట్లకు పైగా గ్రాఫిక్స్ కోసం పెడుతున్నట్లు తెలుస్తోంది. అలాగే విజువల్ ఎఫెక్ట్ ను కూడా ఎక్కువగా ఈ సినిమా కోసం వినియోగించబోతున్నారట.

క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ అవకూడదనే ఉద్దేశంతో హాలీవుడ్ టెక్నీషియన్స్ ని ఉపయోగిస్తున్నారట. ఇక మొత్తం 150 కోట్ల రూపాయల లో 50 కోట్లు గ్రాఫిక్స్ కు మరో యాభై కోట్లు పవన్ కళ్యాణ్ కు రెమ్యూనరేషన్ కింద ఇస్తున్నారట. ఇక మిగిలిన బడ్జెట్ తో సినిమా చేయాలని మొదట ప్లాన్ చేశారట. కానీ తాజా సమాచారం ప్రకారం షూటింగ్ పూర్తయ్యే సరికి ఈ బడ్జెట్ మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా. ..జాక్వలిన్ ఫెర్నాండేజ్ ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. కాగా వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమాను రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడు క్రిష్.

Advertisement

తాజా వార్తలు

Advertisement