Friday, May 3, 2024

య‌దార్ధ సంఘ‌ట‌న‌ల జీబ్రా…

సత్యదేవ్‌, కన్నడ స్టార్‌ డాలీ ధనంజయ కథానాయకులుగా ఈశ్వర్‌ కార్తీక్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న -కై-మ్‌ యాక్షన్‌ ఎంటర్‌-టైనర్‌ ‘జీబ్రా’. (లక్‌ ఫేవర్స్‌ ది బ్రేవ్‌) అనేది ఉప శీర్షిక.
ఎస్‌ ఎన్‌ రెడ్డి, బాలసుందరం, దినేష్‌ సుందరం నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రియా భవాని శంకర్‌, జెన్నిఫర్‌ పిచినాటో హీరోయిన్లు. నటు-డు సత్యరాజ్‌ కీలక పాత్రలో కనిపించనున్నారు. సత్య, సునీల్‌ ఇతర ముఖ్య తారాగణం.
ఈ చిత్రం షూటింగ్‌ ఎనభై శాతం పూర్తయింది. తాజాగా పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు ప్రారంభించారు. ఇదివరకు ఎన్నడూ చూడని ఆర్థిక నేరాల నేపథ్యంలో యధార్ధ సంఘటన స్ఫూర్తితో ఈ చిత్రం రూపొందుతోందని చెప్పారు. ఈ చిత్రానికి కేజీఎఫ్‌ ఫేమ్‌ రవి బస్రూర్‌ సంగీతం ఓ ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. సుమన్‌ ప్రసార బాగే సహ నిర్మాత.

Advertisement

తాజా వార్తలు

Advertisement