Sunday, April 28, 2024

వకీల్ సాబ్ రిలీజ్ బాధ్యత వైవీ సుబ్బారెడ్డిదేనట ? దిల్ రాజు మాస్టర్ ప్లాన్ !!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం వకీల్ సాబ్. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతోన్న ఈ చిత్రం ఏప్రిల్ 9న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కాగా ఈ సినిమాను తెలుగు రాష్ట్రాలలో రోజుకి ఆరు షో లు వేసేందుకు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ సర్కారు ను నిర్మాత దిల్ రాజు ఒప్పించారు. ఇక ఏపీ విషయంలో ఆ బాధ్యతని వైసీపీ సీనియర్ నేత వైవి సుబ్బారెడ్డికి అప్పగించారట దిల్ రాజు.

దిల్ రాజు కు వైవీ సుబ్బారెడ్డి కి మంచి సంబంధాలు ఉన్నాయట. మరికొంత మంది వైసీపీ ఎమ్మెల్యేల తో బంధుత్వాలు కూడా దిల్ రాజుకి బాగానే ఉన్నాయట. ఈ నేపథ్యంలోనే వకీల్ సాబ్ సినిమాకు సంబంధించి ఆరు షోలను వేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడట. కాగా ఇటీవల తిరుపతి సభలో పవన్ కళ్యాణ్ వైసీపీపై నిప్పులు చెరిగారు. దీంతో వారంతా కూడా పవన్ పై కోపంగా ఉన్నారట. ఇటువంటి సమయంలో వకీల్ సాబ్ సినిమాకు ఆ అవకాశం ఇస్తారా !! లేదా అనేది చర్చనీయాంశంగా మారింది. దిల్ రాజు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ పట్టు వదల కూడదు అని బావిస్తున్నడట.

Advertisement

తాజా వార్తలు

Advertisement